• Home » Employees

Employees

TG News: పాత ఫైళ్లతో డబ్బులు డ్రా చేసిందెవరు?

TG News: పాత ఫైళ్లతో డబ్బులు డ్రా చేసిందెవరు?

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పేషీలో ఓ ఉద్యోగి పాత ఫైళ్ల (ఎంబీ బుక్కు)పై బదిలీపై వెళ్లిన కమిషనర్‌ సంతకాలతో డబ్బులు డ్రా చేసిన వైనంపై ఇంటెలిజెన్స్‌ పోలీసులు దృష్టి సారించారు. ఈ తతంగంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘పాత ఫైళ్లపై బిల్లులు’ అనే కథనం ప్రచురించింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్‌ అధికారులు నాలుగురోజులుగా కూపీ లాగుతున్నారు.

CM Revanth Reddy: 5 నుంచి భారీగా బదిలీలు!

CM Revanth Reddy: 5 నుంచి భారీగా బదిలీలు!

ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందుకోసం పాలనాయంత్రాంగంలో తహసీల్దార్‌ మొదలు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాకా అన్ని స్థాయుల్లో భారీ బదిలీలకు కసరత్తు జరుగుతోందా?

CM Revanth Reddy: ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం

CM Revanth Reddy: ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం

ఏ ఒక్కరి వల్లనో కాకుండా సమష్టి కృషితోనే రాష్ట్రం సిద్దించిందనే విషయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించిన వారందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు.

Hyderabad: పారిశ్రామిక ప్రగతి  కొత్తపుంతలు తొక్కేలా..

Hyderabad: పారిశ్రామిక ప్రగతి కొత్తపుంతలు తొక్కేలా..

సకాలంలో ప్రొత్సాహకాలను అందించి పారిశ్రామిక ప్రగతిని కొత్తపుంతలు తొక్కించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, ఇప్పటికే పరిశ్రమలను నిర్వహిస్తున్న వారికి సకాలంలో ప్రొత్సాహకాలు అందించేలా విధానాల రూపకల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది.

TG: ప్రభుత్వేతర వైద్య సిబ్బంది వేతనాలకు గ్రీన్‌ చానల్‌

TG: ప్రభుత్వేతర వైద్య సిబ్బంది వేతనాలకు గ్రీన్‌ చానల్‌

వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సిబ్బంది(జూనియర్‌ డాక్టర్లు, పీజీ వైద్య విద్యార్థులు, సీనియర్‌ రెసిడెంట్లు)కి వేతన కష్టాలు తీరనున్నాయి. ప్రతినెలా మొదటి వారంలోనే వారికి జీతాలు, స్టైపెండ్‌ చెల్లించేలా ‘గ్రీన్‌ చానల్‌’ ఏర్పాటుకు ప్రభుత్వం సమాయత్తమైంది.

Hyderabad: లంచావతారాలు

Hyderabad: లంచావతారాలు

రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కారు. ఇంటి నెంబరు కేటాయించేందుకు రూ.35 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం నానాజీపూర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధిక, ఆమెకు సహకరించిన బిల్‌ కలెక్టర్‌ బాల్‌రాజ్‌ ఏసీబీకి పట్టుబడ్డారు.

Rail Nilayam: నకిలీ ఇంటర్వ్యూలు, నియామక పత్రాలు

Rail Nilayam: నకిలీ ఇంటర్వ్యూలు, నియామక పత్రాలు

రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్‌ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.

Hyderabad: పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తేనే పనులు

Hyderabad: పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తేనే పనులు

బల్దియా కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల్లో జీహెచ్‌ఎంసీ అధికారుల వైఖరిని నిరసిస్తూ పోరుకు దిగారు. ఇప్పటికే ఇచ్చిన డెడ్‌లైన్‌ (ఈనెల 18)లోగా బకాయిలు చెల్లించాలని కొన్ని నెలల క్రితం జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో నిర్వహణ పనులను నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.

TG: ఉద్యోగులకు త్వరలో ఒక డీఏ

TG: ఉద్యోగులకు త్వరలో ఒక డీఏ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ఒక డీఏ లభించనుంది. జూన్‌ 2 తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎంవో కార్యదర్శి శేషాద్రితో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో డీఏ తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి హామీ లభించిందని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.

Gangavaram Port: విధుల్లో చేరిన గంగవరం పోర్ట్ ఉద్యోగులు

Gangavaram Port: విధుల్లో చేరిన గంగవరం పోర్ట్ ఉద్యోగులు

విశాఖ: గంగవరం పోర్ట్ కార్మికుల ఉద్యమం కొలిక్కి వచ్చింది. శుక్రవారం నుంచి విధుల్లోకి చేరారు. రేపటి నుంచి ప్రోడక్షన్‌ దిశగా విశాఖ ఉక్కు కర్మాగారం పని చేయనుంది. ఒన్ టైమ్ సెటిల్‌మెంట్ దిశగా గంగవరం పోర్ట్ కార్మికులు అడుగులు వేస్తున్నారు. గత 41 రోజులు, ఇప్పుడు 20 రోజులుగా చేస్తున్న ఉద్యమనికి ఉద్యోగులు స్వస్తి పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి