Home » Droupadi Murmu
లోక్ సభ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఎన్డీఏ కూటమి.. కేంద్ర పగ్గాలు మరోసారి చేపట్టింది. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోదీ కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీని ముర్ము కోరారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 17వ లోక్సభ ను రద్దు చేశారు. ప్రస్తుత లోక్సభను రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ) సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఉదయం సిఫారసు చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనతో సహా తన మంత్రివర్గ సహచరుల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బుధవారంనాడు అందజేశారు. రాష్ట్రపతి భవన్కు మోదీ స్వయంగా వెళ్లి రాజీనామాలను సమర్పించారు. అందుకు అంగీకరించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం జరిగేంత వరకూ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు.
అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు. ఆ క్రమంలో శ్రీరాముడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్మ అయోధ్య ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు.
దేశవ్యాప్తంగా సైనిక స్కూళ్లను 'ప్రైవేటుపరం' చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారంనాడు ఒక లేఖ రాశారు. సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇందుకు సంబంధించి చేసుకున్న ఎంఓయులను రద్దు చేయాలని కోరారు.
దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణికి ప్రదానం చేస్తున్న సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలుచుని ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూర్చుని ఉండటంపై జార్ఖాండ్ ముక్తి మోర్చా ఆక్షేపణ తెలిపింది. ఆమె గిరిజన మహిళ అయినందునే రాష్ట్రపతిని ప్రధాని అవమానించారని విమర్శించింది.
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. హోలీ రంగులు దేశ వైవిధ్యానికి ప్రతీకలని ఆమె అన్నారు.
కేరళ ప్రభుత్వం అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపై సంతకాలు చేయకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసాధారణ జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మతంతో సంబంధం లేకుండా వివాహాలు, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వ చట్టాలు అందరికీ ఒకేరీతిలో వర్తించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, బిల్లు సభామోదం పొందింది.