Home » Devotional
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. 27న వినాయక చవితితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
గత రెండు మూడేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రూ.500 దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. శరన్నవరాత్రుల్లో అంతరాలయం దర్శనం ఉండదు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలతో ఉత్సవాలు జరిపేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాము అనుకున్న ఎత్తులో మట్టి ప్రతిమలు లభ్యం కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలనే మండపాల్లో కొలువుదీరుస్తున్నారు.
శ్రావణ మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకూడదని అంటారు. అయితే, ఈ మాసంలో వాటిని ఎందుకు తినకూడదు? మతపరమైన, శాస్త్రీయ కారణాలు ఉన్నాయా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఏఐ టెక్నాలజీని వినియోగించి భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించడం సాధ్యం కాదంటూ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేశారని టీటీడీ చైర్మన్ విమర్శించారు.
అన్నవరం సత్యదేవుని కొండపై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. దేవస్థానంలో బహిరంగ వేలంలో హెచ్చుపాటదారుడుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. స్వామివారికి అలంకరణ అనంతరం వాడిపోయే పూలను తరలించే కాంట్రాక్టు పనికి ఆలయ అధికారులు బహిరంగ వేలం వేశారు.
శ్రావణ మాసంలో భక్తులు ఆధ్యాత్మికంగా ఉండేందుకు ఆహారపు నియమాలను పాటిస్తారు. అదే సమయంలో వర్షాకాలం కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యం. అయితే, ఈ మాసంలో ఏమి తినాలి? ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
తిరుమలలో వేంకటేశ్వర స్వామిని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్ దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో శ్రావణ మాసంలో ప్రతీరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ప్రతీ శుక్రవారం ఇల్లాళ్లు మహాలక్ష్ముల్లా కళకళలాడుతూ... తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
ఆ రాశి వారు ఈ వారం సంతోషకరమైన వార్త వింటారని ప్రమఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. తలపెట్టిన కార్యం నెరవేరుతుందని, ఆందోళన తగ్గి స్థిమితపడతారని తెలుపుతున్నారు. ఇంకా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.