Home » Devotees
దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఇక, హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేల సంఖ్యలో గణనాథుని విగ్రహాలు నగరవ్యాప్తంగా కొలువుదీరాయి. కాగా, ఇవాళ(శనివారం) 11వ రోజు కావడంతో వందల సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్ సాగర్తో సహా పలు ప్రాంతాల్లో నిమజ్జనం అవుతున్నాయి. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని రేపు ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా 12 గంటలకు మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేసి ఎల్లుండి ఉదయం తెల్లవారుజామున 3.30గంటలకు ఆలయాన్ని ఆలయ అధికారులు తెరవనున్నారు.
ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. హుస్సేన్సాగర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాల సందర్భంగా లడ్డూ వేలం పాటలను నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. సిటీలో మాదాపూర్ మై హోమ్ భుజా గణేష్ లడ్డూకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి ఏడాది అంతకంతకూ ఈ లడ్డూ ధర రికార్డ్ బ్రేకవుతోంది.
దొంగ దండాలు పెడితే వినాయకుడు క్షమించరని.. వాళ్ల సంగతి చూస్తారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు లేకుండా ఏపీ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
గణపయ్య మోతీచూర్ లడ్డూలను ఎంతో ఇష్టంగా తింటాడని అంటుంటారు. వాస్తవానికి ఈ లడ్డూలను కేవలం 10 నిమిషాల్లో తయారు చేయవచ్చు. కాబట్టి, ఈసారి బజార్లో కొన్నవి కాకుండా ఇంట్లో చేసిన మోతీచూర్ లడ్డూలనే వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి.
సర్వవిఘ్నాలను హరించి విజయాలను చేకూర్చే విఘ్నవినాయకుడి అనుగ్రహం పొందాలంటే ఈ వినాయక చవితి రోజున ఈ సమయంలో పూజించాలని పండితులు సూచిస్తున్నారు.
ఐదేళ్లు దేవుళ్లని కూడా దోచుకున్నందుకే జగన్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు పక్కన పెట్టారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన హిందూ దేవాలయాలు, ఆచారాలను కూటమి ప్రభుత్వం పరిరక్షించి ప్రాధాన్యం కల్పిస్తోందనే కడుపుమంటతో జగన్ విష ప్రచారానికి దిగారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు.
గత ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ బురద జల్లుతోందని టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై వైసీపీ ఆరోపణలు అన్ని అవాస్తావాలని చెప్పుకొచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక్క ప్రోటోకాల్ తప్పా ఎలాంటి సదుపాయాలు ఉపయోగించుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని కాపాడాలని ఏపీ ప్రభుత్వాన్ని రాజాసింగ్ డిమాండ్ చేశారు.