Home » Devotees
మహాశివరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం రాత్రి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడికి ఏకాంత సేవను వేడుకగా నిర్వహించారు.
శాసనమండలిలో కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని పట్టుకున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకొని చాలా అభ్యంతరకరంగా వ్యవహరించారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను 200 మంది రష్యన్, జర్మన్ దేశస్తులు దర్శించుకున్నారు. రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠానికి విచ్చేసిన వీరిని.. శక్తిపీఠం పీఠాధిపతి మూర్తి ఆహ్వానించారు..
దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం ఇచ్చారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పద్మభూషణ్ త్రిదండి చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత కోసం ఇప్పుడు వనితలు కొట్లాడుతున్నారని పేర్కొన్నారు..
శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడేందుకు టీటీడీ బోర్డు కట్టుబడి ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి కొనుగోలులో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేశామని ఉద్ఘాటించారు.
జగన్ హయాంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్వామి వారికి 20 కోట్ల కల్తీ లడ్డూలను ప్రసాదంగా సమర్పించారని.. ఇది మహా అపచారమని ఆందోళన వ్యక్తం చేశారు.
వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారాయన.
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదికలో ప్రస్తావించింది. 2022-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ నివేదికలో వెల్లడించింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో లడ్డూని కల్తీ చేశారని ధ్వజమెత్తారు..
అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు సోమవారం నిరసనకు దిగాయి. వైసీపీ హయాంలో తిరుమలలో చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశాయి. టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నాయి..