Home » Devotees
తిరుమల శ్రీవారు మంగళవారం ఉదయం సూర్యప్రభమీద ఊరేగిన స్వామి, రాత్రి చంద్రప్రభపై విహరించాడు.
దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో కూటమి ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆలయాల్లో నాయీబ్రాహ్మణులకి ట్రస్టు బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తుచేశారు.
దుర్గామాతను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.శివకుమార్ తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం చాలా చక్కగా ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలంతా పండుగను ఘనంగా చేసుకోవాలని రేవంత్రెడ్డి, కేసీఆర్ ఆకాంక్షించారు.
మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి పోలీసు అధికారులు స్పందించారు. కపిలతీర్థంలో తొక్కిసలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తిరుపతి పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయం వద్ద ఆక్టోపస్ సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించారు.
గిన్నిస్ బుక్ రికార్డులో చేరే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్తగా కవులు, రచయితలను పిలిచి వారితో చర్చించి బతుకమ్మ పాటలు పాడేలా ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు వాహన సేవ దర్శనం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వాహన సేవలు జరిగే మాడ వీధుల్లో రెండు లక్షల మందికి వాహన సేవలను ప్రత్యక్షంగా చూసేలా అవకాశం కల్పిస్తున్నట్లు బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు ప్రకృతితో మమేకమై.. పూల జాతరగా మారే తెలంగాణ సంప్రాదాయిక బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచులందరూ ఎదురుచూస్తారు. ఎంతో ఉత్సాహంగా సాగే బతుకమ్మ సంబురాల కంటే ముందు బొడ్డెమ్మ ముందుకు వస్తోంది.