Home » Cyclone
మొన్నటి వరకూ తీవ్ర మోంథా తుఫాన్ ప్రభావంతో తల్లడిల్లిన తెలుగురాష్ట్రాల వాసులకు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు విపత్తు నిర్వహణ సంస్థ..
మొంథా నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఏపీలో పర్యటించనుంది. టీమ్-2లో అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డైరెక్టర్ కె.పోన్నుసామి, కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ, హైదరాబాద్ నుంచి శ్రీనివాసు బైరి, కేంద్ర విద్యుత్ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆర్తీ సింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా ఉన్నారు.
మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందజేస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులని పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు.
ఏపీలో జరుగనున్న అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో మొంథా తుపాను నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
గత వైసీపీ పాలనలో ప్రకృతి విపత్తులు వస్తే సాయం మాట అటు ఉంచి కనీసం పలకరించే వారే లేరని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాడు జగన్ గాలిలో పర్యటించి ఇచ్చిన హామీలు గాలిలోనే కలిసిపోయాయని మంత్రి ఎద్దేవా చేశారు.
మొంథా తుఫానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని అధికారులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేశారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు తగ్గాయి కాబట్టి పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులని ఆదేశించారు.
మొంథా తుఫాన్.. ఈ పేరు ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. భయపెడుతున్న ఈ తుఫాన్ అప్డేట్స్.. ఎప్పటికప్పుడు మీ ముందుకు..
ప్రజలకు ఎలర్ట్ మెసేజ్లు కూడా పంపామని.. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు. ప్రతి జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం బాగా పని చేశారని కొనియాడారు.
బోటు ఉన్న ప్రాంతానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేరుకున్నారు. ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారులు బోటును తరలించే చర్యలు చేపట్టారు.