Home » Crime News
ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో డివైడర్ను దాటిన కారు ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది.
ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడు మోసం చేయడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పట్టణంలో చోటుచేసుకుంది. దీప రోషిణి అనే విద్యార్థిని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి.
మెరుగు పెడతామంటూ.. గ్రామాల్లో తిరుగుతూ బంగారం గొలుసు ఎత్తుకెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గ్రామంలోకి వచ్చి ఇత్తడి సామాన్లకు మెరుగు పెడతామని చెబుతూ మోసాలకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
శబరిమలకు వెళ్లి వస్తూ మార్గమధ్యలో నదిలో స్నానానికి దిగి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. నందకుమార్ (27) అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అయితే.. బరిమలకు వెళ్లి వస్తూ నదిలో మునిగి చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.
ఉత్తర్ప్రదేశ్లో నేరాల సంఖ్య తగ్గిపోయింది.. గల్ కల్చర్కు చెక్ పెట్టామని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పిన గంటల వ్యవధిలోనే అలీఘర్లోని ఏఎంయూలో ఓ ఉపాధ్యాయుడిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒడిశాలో తీవ్ర విషాధ ఘటన చోటు చేసుకుంది.
కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందన్న బాధతో.. ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నగరంలో చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ జయరామ్నగర్కు చెందిన కృష్ణ భార్య కొంపల్లి నాగమణి ఆగ్మహత్యకు పాల్పడింది. కూతురి ప్రేమ పెళ్లి చేసుకుందన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసివది.
ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో బోరు బావులు, నీటి సంపులు, సెప్టిక్ ట్యాంక్ మూతలు తెరిచి ఉండటం వల్ల చిన్న పిల్లలు తెలియకుండా అందులో పడి చనిపోతున్నారు.. ఇలాంటి ఘటనే సిరిసిల్లలో చోటు చేసుకుంది.
ఓ హత్య కేసు లింకులో మారణాయుధాల గుట్టు రట్టయింది. దాదాపు 60 మంది పోలీసులతో మొత్తం సోదాలు నిర్వహించగా పెద్దఎత్తున మారణాయుధాల బయటపడడం గమనార్హం. వాటిని చూసి పోలీసులే విస్తుపోయారంటే.. ఇక పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
కారులో స్వల్పంగా జరిగిన గొడవ.. చివరకు ఒకరి ప్రాణం పోయే వరకు వచ్చింది. ఈ సంఘటన నగరంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పేర్తి వివరాలిలా ఉన్నాయి.