Home » Covid-19
కరోనాతో 15 ఏళ్ల బాలిక మాటలు కోల్పోవడం అమెరికాలో వెలుగు చూసింది. మసాచుసెట్స్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస సంబంధిత వ్యాధితో బాధితురాలు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్( Massachusetts General Hospital)లోని అత్యవసర విభాగంలో చేరింది.
కేరళ రాష్ట్రాన్ని కరోనా మళ్లీ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ప్రభావంతో ఇటీవల మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు కేరళ వాసులను భయపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కేరళలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులపై కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ ఉపరకానికి చెందిన 21 కేసులు ఇంతవరకూ నమోదయ్యాయి. అత్యధికంగా గోవాలో 19, కేరళ, మహారాష్ట్రలో చెరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 పరిస్థితి, ప్రజారోగ్య వ్యవస్థల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారంనాడు సమీక్షించారు.
విలేజ్ హెల్త్ క్లీనిక్లలో కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ( Rapid test kits ) ను సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణ బాబు ( Krishna Babu ) తెలిపారు. మంగళవారం నాడు కొవిడ్ కొత్త వేరియంట్ సన్నద్ధతపై హెచ్ఓడీలు, వైద్యాధికారులతో కృష్ణబాబు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కరోనా ( Carona ) మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈసారి JN-1 పేరుతో కొవిడ్ వ్యాప్తి చెందుతోంది. ఈ కరోనా కొత్త వేరియంట్తో భారతదేశంలోని పలు రాష్ట్రాలల్లో కేసు నమోదవుతున్నాయి. అయితే కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.
పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్-19 ( Covid-19 ) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరియు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్య శాఖ అప్రమత్తంగా మరియు అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ( Minister Damodara Rajanarsimha ) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జేఎన్- 1 కొవిడ్ వేరియంట్పై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ సీనియర్ నేత, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ( Boora Narsaiah Goud ) తెలిపారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్లు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కొత్త వేరియంట్పై ఆందోళన అవసరం లేదు’’ అని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోవడం, కేసులు కూడా గణనీయంగా పడిపోవడంతో.. ఇక ఆ వైరస్ నుంచి విముక్తి లభించినట్టేనని అంతా అనుకున్నారు. పరిస్థితులు కూడా దాదాపు సాధారణ స్థితికి వచ్చేశాయి. కానీ..
రూపం మార్చుకుని కొత్త వేరియంట్లతో దాడి చేస్తున్న కరోనా మహమ్మారి అందరినీ భయపెడుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 నూతన కరోనా కేసులు నమోదు కావడంతోపాటు ఐదుగురు చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్లతో భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు.