Home » Congress
కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ శ్లాబుల్లో భాగంగా సిగరెట్, పొగాకుపై ఉన్న 28 శాతం పన్నును 40 శాతానికి పెంచింది. బీడీలపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీన్ని విమర్శిస్తూనే కేరళ కాంగ్రెస్ యూనిట్ పోస్ట్ పెట్టింది.
కేంద్ర మంత్రివర్గంలోని 72 మందిలో 40శాతం మంత్రులపైనా, వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 643 మంది మంత్రుల్లో 47 శాతం మంది మంత్రులపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై ఢిల్లీ కోర్టులో దాఖలైన ఓ పిటిషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోనియా 1983లో అధికారికంగా భారత పౌరసత్వం పొందినప్పటికీ, 1980లోనే ఆమె పేరు ఓటరు జాబితాలో ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ నేత పవన్ ఖేడాకే కాదు ఆయన భార్య కోట నీలిమకు కూడా రెండు ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు (ఎపిక్లు) ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.
బీహార్లో ఇటీవల రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కొందరు మరణించిన ప్రధాని తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై పీఎం మోదీ తాజాగా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
కొందరు తటస్థులు కూడా ఫోన్ చేసి తనకు మద్దతు పలికారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఉండే మెజారిటీ ప్రజల అభ్యర్థినని గొప్పగా ఫీల్ అవుతున్న అని హర్షం వ్యక్తం చేశారు. పది రోజుల్లో తాను కూడా రాజకీయాల్లో ముదిరి పోయా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖాన్ని చూపించలేరని విమర్శించారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాజ్ భవన్లో కలిశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లు ఆమోదం కోసం వినతి ఇచ్చారు.
బీసీ రిజరేషన్లకు సంబంధించిన బిల్లులకు బీఆర్ఎస్ సంపూ ర్ణ మద్దతు అందిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.
బిహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికే 'ఇండియా' కూటమిలోని పలు పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. జాబితాలో పేర్లు లేకుండా చేయడం, సరైన నోటీసులు ఇవ్వకపోవడం ద్వారా లక్షలాది మందికి ఓటు హక్కు లేకుండా చేశారని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి.