Home » Congress
సీఎం సిద్ధారామయ్యతో పాల్గొనాల్సిన ఒక కార్యక్రమం కోసం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఉదయం మంగళూరు వచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే మద్దతుదారులు ఈ సందర్భంగా డీకే-డీకే అంటూ నినాదాలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ఎంసీడీ ఉప ఎన్నికలు రావడంతో ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు ఇది పరీక్షగా అందరూ భావించారు. అయితే ఆమె సునాయాసంగా ఈ పరీక్షలో నెగ్గారు.
తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేచయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
'సంచార్ సాథీ' అంశం ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేసింది. ఈ యాప్ తీసుకురావడం ప్రజల ప్రైవసీని కేంద్రం హరించడమేనని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై చర్చకు వ్యతిరేకం కాదని అధికార పక్షం వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించడం లేదు.
థరూర్ స్వరాష్టమైన కేరళలో వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఆయన ఒకవేళ కాంగ్రెస్కు ఉద్వాసన చెప్పాలనుకుంటే ఎన్నికలకు ముందే ఆపని చేయాల్సి ఉంటుంది.
మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్ గా ఉన్నారు. కేసీఆర్ కుమార్తెగా గౌరవించి ఇన్నాళ్ళు కామ్గా ఉన్నామని, ఇక మాటకు మాట సమాధానం చెబుతామని అంటున్నారు. పార్టీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే అందుకు కారణమని తెలుస్తోంది.
ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం, తాజాగా ఎంసీడీలోని 12 వార్డులకు ఉపఎన్నికలు జరగడంతో ప్రజలు ఏపార్టీని ఆదరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలతో సహా మరికొందరిపై ఢిల్లీ ఈవోడబ్ల్యూ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురి పేర్లు నమోదు చేసింది.
ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.
సీఎం పోస్టుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తుండగా, డీకే మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుందన కర్ణాటక రైతుల సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తానని చెప్పారు.