Home » Congress
ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
కాంగ్రెస్ను బలహీనపరచడానికే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. జీవన్ రెడ్డికి పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేస్తూ, కేసీఆర్ బాధ్యతగా శాసనసభకు హాజరవ్వాలని సూచించారు.
భట్టి విక్రమార్క ఛాంబర్లో కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మహేష్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు.
ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హుకుం జారీ చేశారు.
అన్నదాతల సమస్యలను పట్టించుకోవడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహించారు.
కొందరు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ కేవలం పండుగ మాత్రమే కాదని, ఆత్మశుద్ధి చేసుకునే సమయమని అన్నారు.
ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇందల్వాయి మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. సొంత మేనల్లుడే కారుతో గుద్ది, కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారు.
పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. ఈ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.