Home » Congress
ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 2 సెంటిమీటర్ల వర్షాన్ని తట్టుకునే విధంగా గత పాలకులు హైదరాబాద్ స్ట్రక్చర్ నిర్మాణం చేశారని తెలిపారు.
ఓటు చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పవర్ ఆఫ్ ఓటుకి దెబ్బ తగులుతోందని చెప్పుకొచ్చారు. దేశంలో 80 శాతం మంది ప్రజలు ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.
డీఎంకే మాజీ మంత్రి, ఆ పార్టీ కరూరు జిల్లా ఇన్ఛార్జి సెంథిల్ బాలాజీ కాంగ్రెస్ సభ్యులకు డీఎంకే సభ్యత్వం కల్పించి పార్టీలో చేర్చుకోవడంపై ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఆగ్రహం వ్యక్తం చేశా రు. కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతోం ది.
ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపిక చేస్తారని డీఎంకే ప్రిసీడియం కార్యదర్శి ఆర్ఎస్ భారతి పేర్కొన్నారు.
రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ తో కలిసి ఆయన సమావేశమయ్యారు.
ఎన్నికల్లో బీజేపీయే గెలిచేలా వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఓట్ల చోరీ కుట్ర బయటపడిందని.. అలా ఏర్పడిన ఈ ప్రభుత్వానికి ఎలాంటి నైతిక, రాజకీయ చట్టబద్ధత లేదని కాంగ్రెస్ పేర్కొంది. ఓట్ల చోరీ వ్యవహారంతో...
తేజస్వి యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వదులుకోవడం ఇష్టం లేకనే పాట్నలో సీడబ్ల్యూసీ పెట్టారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ డ్రైవింగ్ సీటు తీసుకుని ఆర్జేడీ నుంచి ఎక్కువ సీట్లు తీసుకోవాలనుకుంటోందని చెప్పారు.
బీహార్లోని 25 జిల్లాల్లో ఆగస్టు 17 నుంచి 15 రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఇప్పటికే కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది.