Home » Congress Govt
42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ తరఫున సింఘ్వీ , దవే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రులు బట్టి విక్రమార్క , పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి నిన్న(ఆదివారం) రాత్రే ఢిల్లీ చేరుకున్నారు.
జూబ్లీహిల్స్లో ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ ఎమ్మెల్యే పోటీకి ఎలా అర్హులు అవుతాడని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. 'నవీన్ యాదవ్కు ఓటర్ ఐడీ కార్డులు ఎవరిచ్చారు, GHMC కమిషనర్ ఇచ్చారా..? ఎన్నికల కమిషన్ ఇచ్చిందా..?' ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అటవీ శాఖకు రెవెన్యూ శాఖ ఇచ్చిన భూమి, అలాగే అటవీ శాఖ రెవెన్యూ శాఖకు ఇచ్చిన భూమిపై వివరాలను రెండు శాఖలు కలిసి నివేదిక ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చకు సిద్ధమని హరీష్ రావు సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహించమంటే సీఎం రేవంత్ రెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఆదివారం ఉదయం నుంచి దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి.
తెలంగాణలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని రాంచందర్ రావు కోరారు. వర్షాలతో పంట నష్టం వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వెయ్యలేదని ఆరోపించారు.
అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లను ఎత్తివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. అయితే..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయం దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. దీని కోసం త్రి మెన్ కమిటీని బీజేపీ ఏర్పాటు చేసింది.
బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది.