Home » CM Stalin
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్కి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన సభలకు అనుమతి ఇవ్వలేం.. అంటూ పేర్కొనడం తమిళనాట ఇప్పుడు సంచలనానికి దారితీస్తోంది. కరూర్ లో విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణింంచిన సంగతి తెలిసిందే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవై, మదురై ప్రాంతాల్లో అమలుకాకుండా అడ్డుకునేందుకు డీఎంకే ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.
మదురై, కోయంబత్తూరు మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం అనుమతివ్వలేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు. కోవై, మదురై మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతివ్వకుండా వివక్ష చూపిస్తోందంటూ స్టాలిన్ ఆరోపించిన విషయం తెల్సిందే.
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి అభ్యర్థులే గెలవాలని, ఆ దిశగా నియోజకవర్గాల ఇన్చార్జులు గట్టిగా ప్రయత్నించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు.
నలుపు, ఎరుపు రంగులు కలిగిన డీఎంకే పతాకం రూపొందించి 75 యేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం వళ్లువర్కోట్టం లో రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.
డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు పూర్వం సిద్ధాంతపరంగా వేర్వేరు మార్గాల్లో పయనించినా ప్రస్తుతం దేశ సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి ఒకే కూటమిలో కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. మతత్త్వపార్టీ బీజేపీకి వ్యతిరేకంగా రెండు పార్టీలూ సమైక్యంగా పోరాడుతున్నాయని చెప్పారు.
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నవంబర్ 5వ తేదీ కరూర్కు రానున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) ప్రకటించింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధ్యక్షుడు విజయ్ గత నెల 27న కరూర్ పర్యటించిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందడం దేశవ్యాప్తంగా కలకలంరేపిన విషయం తెలిసిందే.
కరూర్లో ‘తమిళగ వెట్టి కళగం’ (టీవీకే) రోడ్షోలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందటానికి ఆ పార్టీ నాయకుడు ఏడు గంటలు ఆలస్యంగా రావటమే కారణమని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
ప్రజాధనం దోచుకుంటున్న డీఎంకేను అడ్డుకుంటున్నారన్న ఆగ్రహంతోనే రాష్ట్ర గవర్నర్ను ఆ పార్టీ శత్రువుగా పరిగణిస్తోందని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ పేర్కొన్నారు.
స్టార్ హీరోయిన్ త్రిషా చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తున్నారు. ఇది సీఎం స్టాలిన్ నివసించే రోడ్డుకు సమీపంలో ఉండటంతో.. ఆ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.