Home » CM Stalin
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 164 మంది అభ్యర్థుల జాబితాను డీఎంకే శనివారంనాడు విడుదల చేసింది. ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మరోసారి కొలతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, సెక్యూలర్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఏప్రిల్ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని డీఎంకే ప్రధాన కార్యాలయం గురువారం ప్రకటించింది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అరివాలయంలో డీఎంకే ఆశావహుల వద్ద ఉత్సాహభరితంగా ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ప్రజలు ఢిల్లీ అధిపత్య కూటమిని అంగీకరించరని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.
త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ డీఎంకే ప్రభుత్వమే ఏర్పడనుందని హైదరాబాద్కు చెందిన ‘పారావీల్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ ప్రకటించింది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల వారీగా అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ ఒక అంచనాకు వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇటీవల తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే గిప్ట్ ఈనెల 8వ తేదీ నుంచి అందించనున్నారు. రాజధాని చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందజేయనున్నారు.
ఏం డౌట్ అవసరం లేదు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే.. అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ చేసే బాధ్యత కూడా ఎంపీ కనిమొళికి అప్పగించానని తెలిపారు. డీఎంకేకు అధికారం ఖాయం అని ఆయన అన్నారు.
నేను, నాన్న కరుణానిధి క్రికెట్ లవర్స్ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... కరుణానిధి క్రికెట్ పోటీలను స్టేడియంకు వెళ్ళి ఆసక్తిగా తిలకించేవారని గుర్తు చేశారు. అలాగే... క్రికెట్లో ధోనీ కెప్టెన్సీ అంటే తనకెంతో ఇష్టమని ముఖ్యమంత్రి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే తరుపున రూపుదిద్దుకోనున్న మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందని ఎంపీ కనిమొళి అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, మహిళలకు హక్కులు, అన్నదాతలకు భద్రత వంటి అంశాలపై మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు.