Home » Chittoor
కుప్పం నియోజకవర్గానికి రూ.2979 కోట్ల పెట్టుబడితో మరో రెండు భారీ పరిశ్రమలు రానున్నాయి. రాష్ట్ర రాజధానిలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
డిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనతో తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు.
నగల దొంగతనానికి అడ్డుపడిందని ఓ మహిళను హతమార్చిన వైనమిది,
ఎద్దులను శుభ్రం చేసేందుకు కుంటలోకి దిగిన మేనమామ, మేనల్లుడు నీట మునిగి చనిపోయిన వైనమిది.
పలమనేరు ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గజరాజుల విన్యాసాలను పవన్ కల్యాణ్, అధికారులు తిలకించారు.
తిరుపతి SVUలో మరోసారి ర్యాగింగ్ అంశం సంచలనమైంది. సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్కు గురిచేసినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై HODకి ఫిర్యాదు చేస్తే.. 'ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు'అంటూ..
శ్రీకాళహస్తీశ్వరస్వామికి శుక్రవారం హైదరాబాద్కు చెందిన ఇందిర రూ.9.32లక్షల విలువైన 96గ్రాముల బంగారు కాసుల దండ, 650గ్రాముల వెండి బిందెను వితరణ చేశారు. వీటిని ఈవో బాపిరెడ్డి స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక నుంచి నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజనులో ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఒకే రెవెన్యూ డివిజన్ కింద ఒకటికి మించి నియోజకవర్గాలు.. ఒకే నియోజకవర్గంలోని మండలాలు కొన్ని ఒక డివిజనులో.. మరికొన్ని ఇంకో డివిజనులో వుండడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి.
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరులో అక్రమాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు మాన్యువల్గా ఉన్న మస్టర్లు ఇకపై ఆన్లైన్ ద్వారా నమోదు కానున్నాయి.
గ్రామపంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా అమలుచేసేందుకు, నిత్యం పర్యవేక్షించేందుకు ‘డివిజన్ డెవల్పమెంట్ ఆఫీస్’ (డీడీవో) ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లాకు నాలుగు కార్యాలయాలు కేటాయించగా, చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరిలలో ఏర్పాటు చేశారు. నవంబరు 1 నుండి ఈ కార్యాలయాలు పనిచేస్తాయి.