Home » Chittoor
అటవీ ప్రాంతాల సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏనుగుల సంచారం అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
ఐదు నెలల కిందట లింగ నిర్ధారణ ముఠాను పట్టుకున్నా, వారిలోని వైద్య సిబ్బందిపై చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. మొత్తం ముగ్గురున్నారని తేల్చి... ఐదు నెలల జాప్యం తరువాత శుక్రవారం ఒకరిపై మాత్రమే చర్యలు తీసుకోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసాయి.
అదే రైలులో చిత్తూరుకు చెందిన 45 ఏళ్ల శంకర్ కూడా ప్రయాణిస్తున్నాడు. అతడు వస్త్ర వ్యాపారం చేయడానికి ఈరోడ్ వెళుతున్నాడు. బుధవారం ఉదయం రైలు ధర్మపురి దాటిన తర్వాత శంకర్ తన పాడు బుద్ధి బయటపెట్టాడు.
అంబేద్కర్ విగ్రహానికి మంటలు ఘటనలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి హస్తం ఉందంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. స్థానిక బొమ్మయపల్లి సర్పంచ్ గోవిందయ్య ఆడిన డ్రామాలో టీడీపీని బలి చేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి చివరకు అతనే అరెస్టయ్యాడని తెలుగు తమ్ముళ్లు పేర్కొన్నారు.
మానవత్వమే సిగ్గుపడే దృశ్యం ఇది. తిరుపతి రుయా ఆసుపత్రికి ఎదురుగా ఇస్కాన్ రోడ్డులోని బస్టా్పలో బతికున్న శవాల్లా పడివున్నారు వీరంతా. ఎవరో తెలీదు. ఎక్కడి నుంచి ఎలా వచ్చారో తెలీదు. ఎప్పుడొచ్చి ఈ నీడకు చేరారో ఏమో.. మూలుగుతూ ముక్కుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టక పోయినా పెట్టినట్లు ఘటనను సృష్టించి స్థానిక టీడీపీ నాయకులపై నెపం నిట్టే ప్రయత్నానికి వైసీపీ సర్పంచ్ గోవిందయ్య ఒడిగట్టారు.
అప్రమత్తమైన పోలీసులు తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజుల స్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
విగ్రహానికి ఆనుకుని ఉన్న షెడ్డుకు ఆగంతకులు రాత్రి నిప్పు పెట్టడటంతో అంబేద్కర్ విగ్రహానికి నష్టం జరిగిందని అధికారులు వివరించారు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం జరిగేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం.
చిత్తూరు జిల్లా దేవలంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విగ్రహం అగ్నికి ఆహుతైంది.