Home » Central Govt
ఢిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
సమాజం గురించి మహిళను ఎడ్యుకేట్ చేస్తే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉద్ఘాటించారు. సురక్షిత సమాజ నిర్మాణం ఏ రాష్ట్రానికైనా ముఖ్యమని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.
చంద్రయాన్లో మహిళల పాత్ర భారతీయుల విలువను పెంచిందని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉద్ఘాటించారు. ఆశా వర్కర్ నుంచి ఐఏఎస్ వరకు, గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటరీ సభ్యురాలి వరకు మహిళల ఉనికి పెరుగుతోందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200రోజులు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్రెడ్డి సమావేశం అయ్యారు.
యూరియా సమస్యపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ తరుపున పోరుబాట పడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. యూరియా సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ టారిఫ్లను ప్రకటించటంతో ఓరుగల్లు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అనేక వస్తువులు, వాహనాలపై జీఎస్టీ భారం భారీగా తగ్గుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జీఎస్టీ సవరణలతో టెంపుల్ టూరిజం అభివృద్ధికి, రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ప్రయోజనకరమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వివరించారు. ఆటోమొబైల్స్ రంగంలో పది శాతం పన్ను తగ్గించడంతో కారు ధరలు రూ.లక్ష వరకు తగ్గే అవకాశం ఉందని విజయ్ కుమార్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.