Home » Businesss
అపోలో హాస్పిటల్స్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 8,000 కోట్ల పెట్టుబడులతో 4,300 కొత్త పడకలను ఏర్పాటు చేయాలని ప్రకటించింది. క్యూ4 లో రూ.390 కోట్లు నికర లాభం నమోదు చేసిన ఈ సంస్థ, ఏడాది మొత్తానికి రూ.1,446 కోట్ల లాభాన్ని సాధించింది.
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) చైర్మన్గా కే ప్రతాప రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎస్బీఐలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ప్రతాప రెడ్డి, టీజీబీలో మూడు సంవత్సరాలు కొనసాగనున్నారు.
స్టాక్మార్కెట్ వారాంతం రోజున తిరిగి నష్టాల్లోకి జారుకుంది. ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా వాణిజ్య అస్థిరతలు, ఐటీ షేర్లలో నష్టాలు మార్కెట్ను క్షీణత వైపు నడిపించాయి.
Kisan Credit Card Apply Online: అన్నదాతల వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం క్రెడిట్ కార్డు (KCC) పథకం ప్రవేశపెట్టింది. రైతులు మాత్రమే కాకుండా మత్స్య సంపద, పశు సంవర్ధకంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరి, కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇదివరకే కార్డు ఉన్నవారు e-KYC అప్డేట్ కోసం ఏం చేయాలి?
EPF And VPF Comparison: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) రెండూ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు తోడ్పడేవే. ఇక, EPF జీతం నుంచి ప్రతినెలా తప్పనిసరిగా కార్పస్ ఫండ్ కు వెళ్తుంది. వీపీఎఫ్ మాత్రం వేతన జీవులకు ఉండే మరో సేవింగ్స్ ఆప్షన్. ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాలేంటి? వీపీఎఫ్ ద్వారా రిటైర్ అయ్యాక ఎంత మొత్తం అదనంగా లభిస్తుంది.. తదితర పూర్తి వివరాలు.
SBI Quick Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్. వీరు ఇప్పుడు యోనో యాప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే రూ.5 కోట్ల రూపాయల వరకూ లోన్ అందుకోవచ్చు. అదెలాగంటే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కేంద్ర ప్రభుత్వానికి భారీ నజరానా ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.2,68,590.07 కోట్ల భారీ డివిడెండ్ ప్రకటించింది.
Air India Flight Ticket Offer: జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనేది మీ కలా.. అయితే, మీ కోరిక తీరేందుకు ఇదే మంచి ఛాన్స్.. వెంటనే ఎయిరిండియా లాంచ్ చేసిన మెగా సేల్లో టికెట్ బుక్ చేసుకోండి. బస్సు లేదా రైలు టికెట్కు అయ్యే ఖర్చుతోనే ఫ్లైట్ ఎక్కేయండి. డిసెంబర్ 10, 2025 వరకూ దేశవిదేశాల్లో ఎక్కడికైనా అతితక్కువఖర్చుతోనే విమాన ప్రయాణం చేసే అవకాశం మిస్సవకండి.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా, 2026 మార్చి తర్వాత ప్రభుత్వ సాయం లేకుంటే దివాలా తప్పదని టెలికాం శాఖకు లేఖ రాసింది. రూ.1.95 లక్షల కోట్ల బకాయిలు ఉండటంతో, కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమవుతోంది.
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి డబ్బులు రాబట్టాల్సిన మదుపరులు జూన్ 2లోగా క్లెయిమ్లు సమర్పించాలని సెబీ హెచ్చరించింది. ఇప్పటికే ఎన్ఎస్ఈ కార్వీని డిఫాల్టర్గా ప్రకటించగా, పీఓఏ ద్వారా షేర్లు తాకట్టు పెట్టిన మదుపరులకు ఇది తుది అవకాశం.