Home » Book release
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఏడాది తర్వాత, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన అంతరిక్ష ప్రయాణ అనుభవాలపై 'ది సెకండ్ ఆర్బిట్'అనే పుస్తకాన్ని రచించారు. ఇందులో ఎన్నో ఆశ్చర్యకమైన విషయాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన 'అప్నాపన్: మై ఎక్స్పీరియన్స్ విత్ నరేంద్ర మోదీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగింది. అప్నాపన్ పుస్తకాన్ని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరించే ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ రోజు (ఆదివారం) విశాఖ మద్దిలపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
కేంద్రం చేపట్టిన ఆపరేష్ సిందూర్ ఉగ్రవాదుల్లో భయం పుట్టించిందని, జాతీయ భద్రతపై భారతదేశానికి ఉన్న కృతనిశ్చయాన్ని బలంగా చాటిచెప్పిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
గల్లా అరుణకుమారిని రాజకీయ నాయకురాలిగా కాక ఆమెలోని పోరాట పటిమను, స్త్రీవాద కోణాన్ని ‘గల్లా అరుణకుమారి స్వీయచరిత్ర’ పుస్తకం వెల్లడించిందని ఈ పుస్తకం ఆవిష్కరణ సభలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ రాసిన ‘మా వాటా మాకే’ పుస్తకం బీసీ ఉద్యమానికి భావజాల ఆయుధం అవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు.
బుక్బ్రహ్మ సాహిత్య ఉత్సవ్లో తెలుగు సాహిత్య సౌరభం వెల్లివిరిసింది. మూడురోజులపాటు సాగిన ఉత్సవంలో వందలాదిమంది తెలుగు రచయితలు, సాహితీ అభిలాషులు పాల్గొన్నారు.
నగరంలో ఏర్పాటు చేసిన "రణధీర సీతక్క"(Randheera Seethakka) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. సీతక్క జీవిత నేపథ్యంతో అస్నాల శ్రీనివాస్ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క తన జీవిత విశేషాలను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
బనారస్ హిందు యూనివర్శిటీ వ్యవస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతి సందర్భంగా 'కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవీయ' ఫస్ట్ సిరీస్ పుస్తకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజకీయ ప్రయాణంపై రచించిన ''మల్లికార్జున్ ఖర్గే: పొలిటికల్ ఎంగేజ్మెంట్ విత్ కంపాషన్, జస్టిస్ అండ్ ఇన్క్లూజివ్ డవలప్మెంట్'' పుస్తకాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారంనాడిక్కడ అవిష్కరించారు.