Home » Bihar
జన్సురాజ్ నిర్మాణానికి తాము ఎంతో కష్టపడ్డామని, మార్పు ఇప్పటికే కనిపిస్తోందని, ఫలితాల కోసం వేచిచూద్దామని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బిహార్ ప్రజలు ఇప్పటికీ మార్పును కోరుకోకుంటే వారితోనే ఉంటూ మరో ఐదేళ్లు పని చేస్తూ వెళ్తానని చెప్పుకొచ్చారు. అంతేకానీ, ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదన్నారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ గత మేలో ఒక మహిళతో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఫేస్బుక్ పోస్టులో వెల్లడించడంతో ఆర్జేడీలో కలకలం రేగింది. దీంతో ఆయనను పార్టీ నుంచి ఆర్జేడీ బహిష్కరించింది.
సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి డిస్పాచ్ సెంటర్ సమీపంలో కొన్ని వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయని, అధికారులతో కలిసి తాము అక్కడికి వెళ్లామని డీఎం కుష్వాహ తెలిపారు. అభ్యర్థుల సమక్షంలో ఆ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
సీతామర్హిలో శనివారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, ఒకానొక సమయంలో బిహార్ ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చేపలను సేకరించేదని, కానీ మత్స్యశాఖకు సంబంధించి తాము తీసుకున్న చర్యల కారణంగా బిహార్ ఇప్పుడు చేపల పెంపకంలో స్యయం సమృద్ధిని సాధించిందని చెప్పారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవడం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎల్ఈడీ వెలుగుల్లో మెరిసిపోవడం ఖాయమని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
జంగిల్ రాజ్ అంటే తుపాకులు, క్రూరత్వం, సామాజిక వ్యతిరేకత, అవినీతి అని మోదీ అభివర్ణించారు. హింసను ప్రోత్సహించే ప్రభుత్వం మనకు అవసరం లేదని, ఎన్డీయే ప్రభుత్వానికి తిరిగి పట్టం కడదామని పిలుపునిచ్చారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉండవచ్చనే దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2010లో నితీష్ ఎంత బలంగా ఉన్నారో అదేవిధంగా ఈసారి నితీష్ బలపడే అవకాశాలున్నాయని కొందరి అంచనాగా ఉంది.
నితీష్ కుమార్ సీఎంగా ఉన్న మొదటి తొమ్మిదేళ్లు కేంద్రంలోని కాంగ్రెస్-ఆర్జేడీ ప్రభుత్వం ఆయనను పనిచేయనీయలేదని, 2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్ అభివృద్ధి కోసం మూడు రెట్లు అధికంగా నిధులు కేటాయించామని మోదీ చెప్పారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్తో పాటు ఇద్దరు ఈసీలు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రియాంక ఓ సభలో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా 'చోర్ చోర్' అంటూ ప్రియాంక మద్దతుదారులు నినాదాలు చేయడం కనిపించింది.
బిహార్ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగబోతోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ విషయంపై మరోసారి బీజేపీ, ఈసీపై విమర్శలు చేశారు.