Home » Bhopal
త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది పనుల్లో వేగం పెంచారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే, మరోవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోయిన మాజీ మంత్రి కొడుకు, అతని ఇద్దరు మిత్రులను మధ్యప్రదేశ్ పోలీసులు రక్షించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని నుహ్ తరహాలో మధ్యప్రదేశ్లో కూడా మతపరమైన అల్లర్లను సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) చేసిన ఓ ట్వీట్ (Tweet) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కస్టమర్కు జొమాటో రిక్వెస్ట్ చేయడం మనం ఆ ట్వీట్లో చూడొచ్చు.
మానవత్వం మరచిన దుర్మార్గులకు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది. పన్నెండేళ్ల బాలికపై అత్యంత అమానుషంగా, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను దింపిన ఇద్దరు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. అంతేకాకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్లోని ఒక కోచ్లోని బ్యాటరీ బాక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
తన అనుమతి లేకుండా భర్త కూరలో రెండు టమాటాలు ఎక్కువగా వేశాడని భార్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన గుర్తిందిగా.. అదేనండి మధ్యప్రదేశ్లోని షాదోల్ ఘటన. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా సుఖాంతమైంది.
వన్య ప్రాణులను కాపాడటం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. చిరుత పులుల జాతి అంతరించిపోకుండా పరిరక్షించేందుకు అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, సత్ఫలితాలు కనిపించడం లేదు. మధ్య ప్రదేశ్లోని కునూ నేషనల్ పార్క్లో నాలుగు నెలల్లోనే ఎనిమిది చిరుత పులులు ప్రాణాలు కోల్పోయాయి.
మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కూతురు ఒక యువకుడిని ప్రేమించిందని, ఆ యువతినీయువకుడినీ చంపి.. వారి మృతదేహాలను బండరాళ్లకు కట్టేసి.. తీసుకెళ్లి మొసళ్లు తిరిగే నదిలో పడేసిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
నేరస్తులు ఎంత తెలివిగా తప్పించుకోవడానికి ప్లాన్ వేసినా ఇక్కడో చోట చిన్న క్లూ విడిచిపెడతారు. దానితో నిందితుల్ని పట్టుకుంటారు పోలీసులు. తాజాగా