Home » Bharath
భారతదేశం ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కోర్ బ్యాకింగ్ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పౌరులు, వ్యాపారాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సేవల్లో అంతరాయం రాకూడదని అన్నారు.
Kishan Reddy: దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక ర్యాలీలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ అమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా భారత్ సిందూర్ యంఎస్ఏంఈ పార్క్గా పేరు పెట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తెలిపారు. యంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్లో మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది అన్నారు.
పాకిస్తాన్ భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇండియాలోని 26 ప్రాంతాల్లో కుట్రలకు పాకిస్తాన్ ప్రేరేపించింది. ప్రధానంగా డ్రోన్ల సహయంతో, స్లీపర్ సెల్స్ సాయంతోని పెద్దఎత్తున భారతదేశంపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ కుట్రపన్నింది.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత వాయుసేన రక్షణ, దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేశారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Bombs Threat: భారత్, పాకిస్తాన్ దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్లో బాంబులు పెట్టినట్లు ఫోన్ చేసి కొంతమంది హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
Operation Sindoor: పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. పంజాబ్, జమ్మూకశ్మీర్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
భారత డ్రోన్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్రంగా దెబ్బతిన్నది. రావల్పిండిలో భారీ నష్టం, పీఎస్ఎల్ రద్దు, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
రష్యా తయారు చేసిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ 400 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించి నాశనం చేయగలదు. ఇది నాలుగు రకాల క్షిపణులతో శత్రు విమానాలు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను ఖచ్చితంగా తాకుతుంది.
భారత్పై పాక్ బుధవారం అర్ధరాత్రి రాకెట్లు, డ్రోన్లతో దాడి చేసిన నేపథ్యంలో భారత గగనతల రక్షణ వ్యవస్థ సకాలంలో ప్రతిస్పందించి ప్రమాదాన్ని తిప్పికొట్టింది. ప్రతిగా భారత్ పాక్లోని 9 నగరాల్లో గగనతల రక్షణ వ్యవస్థలపై విజృంభించింది.