Home » Bengaluru News
ఎనిమిది సంవత్సరాల బాలుడికి 20 రోజుల్లో మూడుసార్లు ఆపరేషన్ చేశారు. అయినా... ఫలితం లేకపోయింది. బాలుడు కన్నుమూయడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అడవిపందిని వేటాడబోయి ఓ వేటగాడు దుర్మరణం పాలయ్యాడు. రామనగర జిల్లా మాగడి అటవీప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లిన సమయంలో నాటు తుపాకీ మిస్ఫైర్ కావడంతో వేటగాడు పాండురంగా దుర్మరణం చెందాడు. స్నేహితుడు కిరణ్తో కలసి నాటుతుపాకీతో వేటకు వెళ్లారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. సన్న పామప్ప అలియాస్ పామన్న నేరం చేసినట్లు రుజువు కావడంతో రాయచూరు జిల్లా మూడో అదనపు ఫాస్ట్ట్రాక్ న్యాయాధికారి బీబీ జకాతి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు.
బెంగళూరులో పట్టపగలే బ్యాంక్ సిబ్బందిని దుండగులు బురిడీ కొట్టించారు. ఆర్బీఐ అధికారులమంటూ బ్యాంక్ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది మోసగించి ఏటీఎం వాహనంలోని నగదుతో పరారయ్యారు.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఓ కీలక పదవి వరించే అవకాశాలున్నాయనే వార్తలను పార్టీ వర్గాలు వెల్లడిస్తుండగా.. ఆ పదవి ఏమిటన్నదానిపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
బెంగళూరులో తాజాగా మరో డిజిటల్ అరెస్టు ఉదంతం వెలుగులోకి వచ్చింది. పార్సిల్లో నిషేధిత పదార్థులు ఉన్నాయని బెదిరించిన నిందితులు ఏకంగా రూ.31.83 కోట్లను తన నుంచి దోచుకున్నారని బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఉత్తరకర్ణాటక సమస్యలపై సమగ్ర చర్చలు జరగాలనే కారణంతో ఏటా బెళగావి సువర్ణసౌధలో శాసనసభ శీతాకాల సమావేశాలు జరుపుతున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అందుకే ప్రభుత్వం నుంచి ఏవిధమైన జీతభత్యాలు స్వీకరించేది లేదని జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ కందకూర్ పేర్కొన్నారు.
తుంగభద్ర జలాశయం నుంచి పంట కాలువలకు జనవరి 10వ తేదీ వరకు నీరు వదిలేలా ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వదలాలని తీర్మానించారు. శనివారం బెంగళూరులోని నీటిపారుదల శాఖ భవనంలో జలవనరుల శాఖ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐసీసీ కమిటీ చైర్మన్ మంత్రి శివరాజ్ తంగడిగే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
తుంగభద్ర డ్యామ్కు పోలీసులు పటిష్ట భద్రతను కల్పిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేగాక... పలు ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. సాయుధ పోలీసు బలగాలు ప్రాజెక్టు పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
బెంగళూరు నుంచి ప్రతిరోజూ బోధన్కు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు టీజీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ప్రసాద్గౌడ్ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బోధన్లో బయల్దేరే బస్సు బాన్సువాడ, నర్సాపూర్, మెదక్, బాలానగర్ల మీదుగా హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్కు చేరుతుందన్నారు.