Home » Bengaluru News
భోజనం చేశాం.. అయితే మాకే బిల్లు ఇస్తావా..అంటూ పోలీసులు ఓ మాజీ సైనికుడిపై విరుచుకు పడ్డారు. ధారవాడలో హోటల్ నిర్వహిస్తున్న మాజీ సైనికుడిని పోలీసులు చితకబాదిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి 11గంటలకు సప్తపుర లే అవుట్ వివేకానంద సర్కిల్లో పోలీసులు భోజనం చేసేందుకు వెళ్లారు.
చీరలు దొంగిలించిన ఓ మహిళను షాపు యజమాని ఇష్టారీతిన కొట్టిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. అయితే, చోరీ చేసిన మహిళతో పాటు ఆమెపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
మీకు కారు ఉందా..? బాడుగకు ఇవ్వాలనుకుంటన్నారా? నాకు చెప్పండి. చాలా పెద్దపెద్ద కంపెనీల వారితో పరిచయం ఉంది. నేను అందులో మీ కారును బాడుగకు పెట్టిస్తాను. మీకు నెలనెలా రెంట్ ఇప్పిస్తానని కారు యజమానులను నమ్మిస్తాడు.
హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా దొడ్డకాడనూరు గ్రామానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. హిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఆమెకు ఒక మగ శిశువు, ఇద్దరు ఆడ శిశువులు జన్మించారని హిమ్స్ ఆసుపత్రి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ న్యాన్సీ పాల్ తెలిపారు.
బెంగళూరు టీడీపీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా దశాబ్దకాలానికి పైగా వ్యవహరించిన కనకమేడల వీరాంజనేయులు అలియాస్ వీరాను తిరుమల తిరుపతి దేవస్థానం బెంగళూరు కమిటీ చైర్మన్గా నియమించారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త కమిటీలను నియమించే విషయంలో వాయిదాలు పడుతూ వచ్చింది.
ప్రధానమంత్రిగా ప్రస్తుతం నరేంద్రమోదీ ఉన్నారని భవిష్యత్తులో యోగీ ఆదిత్యనాథ్ వస్తారని అప్పుడు మరింత కఠిన నిర్ణయాలు తప్పవని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వెల్లడించారు.
రాజకీయాలనుంచి రిటైర్డు అయ్యేది లేదని, ప్రస్తుతం 93ఏళ్లు అని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అయినా వీల్ చైర్లోనే పార్లమెంటుకు వెళ్తానని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. హాసన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై - బెంగళూరు నేషనల్ ఎక్స్ప్రెస్ వే, బెంగళూరు - హైదరాబాద్ హైవేల ప్రాధాన్యత ప్రధానమంత్రికి వివరించానని, వచ్చే బడ్జెట్లో ఎక్కువ గ్రాంట్లు రానున్నాయన్నారు.
రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి.
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు ఎస్ నారాయణ్తో పాటు భార్య, కుమారుడిపై వరకట్నం కేసు నమోదయ్యింది. జ్ఞానభారతి పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నారాయణ్ రెండవ కుమారుడు పవన్ భార్య పవిత్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. వ్యాధులతో జనం విలవిల్లాడుతున్నారు. జ్వరాలతో బాధపడుతున్న జనం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రైవేటు క్లినిక్లకు వెళ్లి పెద్ద మెత్తంలో డబ్బులు ఖర్చు చేసుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.