Home » Bengaluru News
కన్నడ నటుడు మడనూరు మనుపై పోలీసులు అత్యాచారం, దాడితోపాటు ప్రాణాలు తీస్తామనే బెదిరింపుల కేసు నమోదు చేశారు. మరో నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బెంగళూరు నగర శివార్లలో చందాపుర ప్రాంతంలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఓ సూట్కేస్ అనుమానాస్పదంగా పడి ఉంది. ఆ సూట్కేస్లో ఓ మహిళ మృతదేహం ఉండడంతో అందరూ నివ్వెరపోయారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.
త్వరలో ప్రారంభించనున్న విజయవాడ - బెంగుళూరు మధ్య కొత్తగా ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వేలూరు జిల్లా కాట్పాడి రైల్వేస్టేషన్లో ఆగి వెళ్తుందని దక్షిణ రైల్వేశాఖ ప్రకటించింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఈ ఏర్పాట్లు చేశారు.
గాలి జనార్దన్రెడ్డిపై మా పోరాటం ఫలించింది.. అక్రమ మైనింగ్లో దోషులందరినీ శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అలాగే.. నేను బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాలకు వ్యతిరేకిని అని కూడా అన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే..
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన మిస్సైల్స్తో కాంగ్రెస్ వారికే అధిక బాధలున్నాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. అలాగే ఇంకా పలు విషయాలపై మాట్లాడారు.
నా గొంతుకోసినా.. పార్టీ మాత్రం మారే ప్రసక్తే లేదని మాజీమంత్రి ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నేను వేరే పార్టీ పెట్టబోనని, అలాగే తానెందుకు కొత్తపార్టీ పెడతానన్నారు. దీనిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులకు సాగునీరందించే తుంగభద్ర రిజర్వాయర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల నేపధ్యంతో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తున్నారు.
ఓ వివాదం రెండు కుటుంబాల మధ్య పెద్ద అగాదాన్నే నింపింది. అది ఎంతవరకంటే ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది. నా కుమార్తెను హతమార్చి, నీ కుమార్తెకు పెళ్లి ఎలా చేస్తావో అంటూ అతడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నేను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ భార్యను.. అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పవిత్ర అనే మహిళ డీకే సురేష్ భార్యగా ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతోంది. అయితే.. దీనిపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
అప్పటివరకు మేం ఎంతో సంతోషంతో అక్కడి అందాలను తిలకిస్తున్నాం.. కానీ.. అంతలోనే ఆ కాల్పులు ఊహించలేదు.. భయపడుతూనే కశ్మీర్ నుంచి తిరిగి వచ్చాం అని కశ్మీర్ ఉగ్రదాడిని కళ్లారా చూసిన టీఎం రాజశేఖర్ అన్నారు. ఉగ్రదాడి నుంచి బయటపడి తన సొంతఊరైన బళ్లారికి చేరిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.