Home » BCCI
భారత టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా నిర్ణయిస్తూ బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అయ్యర్ తొలిసారి స్పందించాడు. ముంబై టీ20 లీగ్లో సోబో ముంబై ఫాల్కన్స్ తరఫున మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడాడు.
జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో అతడితో పాటు తల్లిదండ్రులనూ అనుమతిస్తూ వారికి ప్రత్యేక సౌకర్యం కల్పించనుంది.
పదిహేనేళ్లకే జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రశంసలు కురిపించాడు. గత సీజన్ నుంచే అతడు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ.. తనేంటో నిరూపించుకున్నాడన్నాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో సహా ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ కుమార్ యాదవ్ను కెప్టెన్సీ నుంచి తప్పించి.. శ్రేయస్ అయ్యర్కు ఆ బాధ్యతలు అప్పగించింది.
టీ20 జట్టు కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆసియా కప్ గెలిపించాడు.. టీ20 ప్రపంచ కప్ను నిలబెట్టాడు.. భారత టీ20 చరిత్రలో అత్యుత్తమ విజయశాతం కలిగిన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అయినప్పటికీ సూర్యకు ప్రత్యేక వీడ్కోలు సిరీస్ లభించలేదు.
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టు మ్యాచ్లో భారత బ్యాటర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 25 ఓవర్లలో వికెట్ కోల్పోయి 96 పరుగులు చేసింది.
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు శనివారం నుంచి భారత్లో పర్యటించనుంది. ముల్లాన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో భారత్తో తలపడనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. టీమిండియాతో శనివారం నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ ముల్లాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అఫ్గానిస్థాన్ కోచ్ రిచర్డ్ పైబస్ మాట్లాడాడు.
సూర్య టీ20 కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఈ పరిణామాలపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ను టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.