Home » Basara Gnana Saraswati
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని మహంకాళి ఆలయంలో జరిగిన చోరీ ఘటనలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉన్నతాధికారులు, నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు.
నిర్మల్ జిల్లా బాసరలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు గోదావరి నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. తాజాగా.. వారి మృతదేహాలను వెలికితీశారు.
బాసరలోని రాజీవ్గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాల యాన్ని (ఆర్జీయూకేటీ) రాష్ట్రంలోని ఇతర సాధారణ విశ్వవిద్యాలయాల తరహాలోనే మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
బాసర ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ ఆలయ అభివృద్ధి ఉండాలన్నారు.
వసంత పంచమి సందర్భంగా.. బాసర క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. గురువారం సాయంత్రానికే బాసర భక్తులతో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బాసర సరస్వతీ దేవి ఆలయంలో అవకతవకలు జరుగుతున్నట్లు విజిలెన్స్ బృందం ప్రాథమికంగా నిర్ధారించింది. సాధారణ భక్తుల రూపంలో ఆలయంలోకి వచ్చిన అధికారులు.. ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు..
ఎగువన కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో గోదారి నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. రెండవ ఆర్చి గేటు నుంచి ఆలయానికి వెళ్లే రహదారిపై వరద వచ్చి చేరింది.
గోదారమ్మ మాత్రం శాంతించని పరిస్థితి. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది. దీంతో వరదల భయంతో బాసర సరస్వతీ దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ గతేడాది కంటే 60 శాతం తగ్గింది.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.