Home » Assam
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనుండటంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీ ట్రబుల్ షూటర్గా పేరున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను రంగంలోకి దింపింది.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడాకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన వారం రోజుల ట్రాన్సిట్ బెయిలుపై అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టును సోమవారంనాడు ఆశ్రయించింది. ట్రాన్సిట్ బెయిలు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.
కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ భార్య మూడు విదేశీ పాస్పోర్టులు కలిగి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు తీవ్ర ఆరోపణలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టంచాయి. అయితే ఈ ఆరోపణలను హిమంత బిశ్వా శర్మ తోసిపుచ్చారు.
అస్సాం ముఖ్యమంత్ర హిమంత బిశ్వా శర్మపై కాంగ్రెస్ సీనిర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అత్యంత అవినీతిపరుడని, విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న ముఖ్యమంత్రి అని అన్నారు.
త్వరలో జరుగనున్న అస్సాం, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. సమ్మిళిత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, మతపరమైన ఏ గ్రూపులకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు.
చొరబాటుదారులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉమ్మడి పౌరస్మృతితో అడ్డుకునే వీలుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. అస్సాంలోని గోల్పాడాలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్షా పాల్గొన్నారు.
అస్సాం గత పదేళ్లుగా గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను మరోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారనే నమ్మకం తనకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ మంగళవారంనాడు విడుదల చేసింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మూడు నెలల్లోపు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని భరోసా ఇచ్చింది.
క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.