Home » Assam
అస్సాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఉమ్మడి పౌర స్మృతి బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో సోమవారంనాడు ప్రవేశపెట్టింది. బహుభార్యాత్వాన్ని నిషేధించడం, బాల్యవివాహాలను అడ్డుకోవడం, సహజీవనానికి, రిజిస్ట్రేషన్ తప్పనిసరిచేయడం, విడాకులు, వారసత్వానికి చట్టబద్ధత కల్పించడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం.
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ.. వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం గువాహటిలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్లో జరిగింది.
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11.40 గంటలకు గువాహటిలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
సీఎంగా ప్రమాణస్వీకారానికి ముందు హిమంత బిశ్వ శర్మ తన మంత్రివర్గంలోకి తీసుకునే నలుగురు మంత్రుల పేర్లను శర్మ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రకటించారు. శర్మతో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న వారిలో రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరో, అజంతా నియోగ్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. పలువురు కేంద్రమంత్రులతో సమావేశాలు పూర్తి చేసిన అనంతరం అస్సాం రాజధాని గౌహతికి సీఎం బయలుదేరారు.
ఎన్నికల మేనిఫెస్టో అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కాబోయే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారిస్తామన్నారు.
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఎంపిక ఖరారైంది. ఈ మేరకు ఆయన ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అస్సాం ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు అందజేశారు.
పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్ర నాయకత్వం సన్నాహాలు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను బీజేపీ మంగళవారంనాడు నియమించింది.
ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో మూడు రాష్ట్రాల్లో పట్టం కట్టారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ‘రౌడీ పరిపాలన’కు ప్రజలు అంతం పలికారని, బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.