Home » AP Police
మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్నటి ఎన్కౌంటర్లో మావో అగ్రనేత హిడ్మా మరణించగా.. ఈరోజు మరోసారి ఎన్కౌంటర్ జరిగింది.
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులకు హిడ్మా రాసినట్లు ఓ లేఖ ప్రస్తుతం సంచలనం రేపుతోంది.
మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలను అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలియజేశారు. నిన్నటి ఎన్కౌంటర్లో హిడ్మా, మరో ఐదుగురు చనిపోయినట్లు చెప్పారు.
పీఎం పాలెంలో మహిళా కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించారు పోలీసులు. ఒకే కేసులో నిందితులు బాధితులుగా.. బాధితులు నిందితులుగా మారినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కిడ్నాప్తో పాటు నకిలీ కరెన్సీ వ్యవహారం బయటకి వచ్చింది.
టీటీడీ మాజీ ఏవీఎస్వో, ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ కేసులో పలు కోణాల్లో అనంతపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనిల్ చోకరాని సిట్ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఏపీకి తీసుకువచ్చి ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
తిరుపతి పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అయితే ఆయన మృతిపై సోదరుడు శ్రీహరి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మదనపల్లిలో కిడ్నీ రాకెట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతిచెందడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సీరియస్గా తీసుకుని విచారిస్తున్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఎన్డీపీఎస్ యాక్ట్ కఠినంగా అమలు చేస్తున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. డ్రగ్స్పై ఏపీలో నిఘా పెరిగిందని.. కఠినతరమైన శిక్షలు, చట్టాలు ఉన్నాయని హెచ్చరించారు.
వైసీపీ హయాంలోని ఐదేళ్ల నిర్లక్ష్యం వల్ల తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి ఆరోపించారు. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో కేతిరెడ్డి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే తప్పేముందని జేసీ అస్మిత్రెడ్డి నిలదీశారు.