Home » AP Liquor
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల రిమాండ్ గడువుని విజయవాడ ఎక్సైజ్ కోర్టు పొడిగించింది. నిందితుల రిమాండ్ గడువుని మార్చి 5వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది..
నకిలీ మద్యం కేసులో నిందితుడు సుదర్శన్కు బెయిల్ మంజూరైంది. ఇబ్రహీంపట్నం, ములకలచెరువుల్లో నకిలీ మద్యం తయారు చేసినట్లు అతడిపై అభియోగాలు ఉన్నాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కల్తీ మద్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. కల్తీ మద్యంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి.
వైసీపీ హయాంలోని జంగిల్ రాజ్ నుంచి రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం బయటపడేసి స్థిరత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. రాజ్ కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
మద్యం కుంభకోణం కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడైన బాలాజీ యాదవ్, అతడి తండ్రి కుల్లాయప్ప పేరిట ఉన్న ఆస్తుల అటాచ్కు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుల బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్వహించిన విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు.
లిక్కర్ స్కాం అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తన దృష్టిలో అసలు లిక్కర్ స్కాం అనే విషయమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన విచారణ ముగిసింది. లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈడీ అధికారులు విజయసాయిని దాదాపు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.