Home » AP High Court
మావోయిస్టు అగ్రనేతలను కోర్టులో హాజరుపర్చాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దేవజీ, రాజిరెడ్డి తమ వద్ద లేరని కోర్టుకు పోలీసులు తెలిపారు.
పరకామణి చోరీ కేసుని ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తన వివరాలను సిట్ బృందం అడగటంపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సుబ్బారెడ్డి.
వీఆర్లో ఉన్న పోలీస్ అధికారులకు జీతాలు రావడం లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో పిల్ వేశారు. ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్పై బుధవారం చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
విజయవాడలో సంచలనం సృష్టించిన చిన్నారి వైష్టవి కిడ్నాప్, హత్య కేసులో ట్రైల్ కోర్టులో తమకు విధించిన శిక్షను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు వేశారు నిందితులు. అయితే, ఈ కేసులో మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్ అప్పీళ్లను కొట్టివేసింది హైకోర్టు.
గ్రూప్-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గ్రూప్-1 జవాబు పత్రాలను హాయ్ల్యాండ్కు తరలించాలనే నిర్ణయం ఎవరిదని ప్రశ్నించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీకి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అది చట్టవిరుద్దం అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని ఏపీ హై కోర్టు స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఓ సందర్భంలో వాలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తుందని... మహిళలు అపహరణకు గురి అవుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. గురువారం ఈ కేసు పిటీషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో 20 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.