Home » AP High Court
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఏ చట్ట ప్రకారం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీ కరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ (Steel Plant) ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ..
ఏపీలో వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీని నిలువరిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. వలంటీర్లు వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని వాఖ్యానించారు. వలంటీర్లపై వచ్చిన ఫిర్యాదులు పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.
విద్యాసంస్థల్లో పదోన్నతులు అలా ఎలా సమకూరుస్తారు.. ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నలవర్షం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ కలిగింది. స్కిల్ కేస్లో ఆయనపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు(APPSC Group 1 Exam) సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు(AP High Court). అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి(Single Judge) ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై గతంలో స్టే విధించింది డివిజనల్ బెంచ్.
Andhrapradesh: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అన్ని శాఖల అధికారాలు ఇవ్వడంపై హైకోర్ట్లో శుక్రవారం విచారణ జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేసిన పిటిషన్పై ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విజిలెన్స్ ఐజీ రఘురామిరెడ్డి పంపిన ప్రతిపాదనలపై స్టే ఇవ్వాలని లోకేష్ కోరారు. టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టేందుకే ఈ ప్రతిపాదన అని పేర్కొన్నారు.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్(Sarath) కేసులో ఏపీ హైకోర్టు, విజయవాడ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నాడు శరత్ కేసును రెండు కోర్టులు విచారణ చేపట్టాయి. ఈ కేసులో కీలక పరిణామాలపై పిటీషనర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం ఏపీ హైకోర్టు, విజయవాడ కోర్టు శరత్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఎన్నికల ముందు మాజీ మంత్రి నారాయణ(Narayana)కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. నారాయణ కేసును గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీఆర్పీసీలోని సెక్షన్ 41ఏ నిబంధనలను పాటించాలని హైకోర్టు ఆదేశించింది. పొంగూరి కృష్ణప్రియ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఏపీలోని ఇసుక సరఫరా, ధరలపై రాష్ట్ర హైకోర్టు మండిపడింది. ఏపీలో ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోందని వ్యాఖ్యానించింది. ఇసుక తవ్వకం, తరలింపుపై అధికారులు నియంత్రణ కోల్పోయారని అని ఆగ్రహం వ్యక్తం చేసింది.