Home » AP High Court
గ్రూప్-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గ్రూప్-1 జవాబు పత్రాలను హాయ్ల్యాండ్కు తరలించాలనే నిర్ణయం ఎవరిదని ప్రశ్నించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీకి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అది చట్టవిరుద్దం అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని ఏపీ హై కోర్టు స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఓ సందర్భంలో వాలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తుందని... మహిళలు అపహరణకు గురి అవుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. గురువారం ఈ కేసు పిటీషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో 20 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని ఏపీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతోందని.. పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ కేసులో మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ని గతంలో ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు మాచర్ల రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
సోషల్ మీడియా యాక్టివిస్టు సవీందర్రెడ్డిని అరెస్టు చేసిన వ్యవహారంలో సీబీఐ తదుపరి కార్యాచరణ చేపట్టవద్దని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవీందర్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై దాఖలైన హెబియస్ కార్పస్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
వైసీపీకి చెందిన తాడేపల్లి నేత సవింద్ర రెడ్డి పిటిషన్పై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం సవింద్ర రెడ్డి అక్రమ నిర్బంధం కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది.