Home » AP High Court
ఆకివీడు రామాలయం నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్లను పిటిషనర్లు ఉపసంహరించుకున్నారు. రామాలయం నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టించారనే ఆరోపణల నేపథ్యంలో శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆకివీడు రామాలయంపై వేసిన పిల్ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే హైకోర్టులో మరో బెంచ్ ముందు రిట్ పిటిషన్తో పాటు కోర్టుధిక్కరణ పిటిషన్ కూడా పెండింగ్లో ఉన్నాయని కోర్టు తెలిపింది.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయనకు ప్రస్తుతానికి ఊరట లభించలేదు.
ఐఏఎస్ అధికారి అహ్మద్బాబుపై దాఖలైన వ్యాజ్యంలో సోమవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగులుకు పదోన్నతులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమేశ్ కుమార్ వేసిన పిటిషన్పై శుక్రవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
కడప జిల్లా మైదుకూరుకు చెందిన సుభాన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లాడు. అతడి బ్యాంకు ఖాతా నిర్వహణపై భార్య, ఇద్దరు పిల్లలు హైకోర్టును ఆశ్రయించారు.
ఏపీ ట్రాఫిక్ చలాన్ల నిధుల వినియోగంపై కొనసాగుతున్న వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆర్బిట్రేషన్ ఉత్తర్వులపై స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం, డేటా ఎవాల్వ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.
భీమవరం డీఎస్పీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భీమవరానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని న్యాయస్థానాన్ని బాలిక తల్లి ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లిసా గిల్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు నిప్పులు చెరిగింది. ఉద్యోగుల పట్ల రాగద్వేషాలతో వ్యవహరించే వ్యక్తి ఐఏఎస్ అధికారిగా కొనసాగడానికి వీల్లేదంది. చట్టం అన్నా, కోర్టు ఉత్తర్వులన్నా ఆయనకు గౌరవం లేదని మండిపడింది.