Home » AP Assembly Sessions
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బదిలీలకు సంబంధించి కీలక చర్యలు తీసుకుంటుంది.
ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. వరుసగా 60 అసెంబ్లీ పని దినాలకు హజరుకానిపక్షంలో వైసీపీ సభ్యులకు అనర్హత వేటు..
ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చంటి పిల్లొడని.. చందమామా కోసం మారాం చేసినట్లుగా చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ల ఆధ్వర్యంలో 2025 నుంచి 2026కు ఉభయ సభల సభ్యులతో సంయుక్త కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇవాళ(శనివారం) ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తన తల్లిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నారావారిపల్లె వచ్చి.. తన తల్లి దగ్గర ఎస్సీ వర్గీకరణ కోసం మెమోరాండం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి ఎస్సీవర్గీకరణ కోసం పోరాటం ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు.
వైఎస్సార్సీపీ సభ్యులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు సభకు దొంగల్లా వచ్చి.. సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు రావాలని.. సమస్యలపై మాట్లాడాలని సభాపతి వారికి సూచించారు.
ఏపీ ఉభయ సభలు గురువారం ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం ఎస్సీ వర్గికరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఉభయ సభల ముందు ప్రవేశపెడతారు. దీనిపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. కాగా ఈరోజు ఎస్సీ వర్గీకరణపై శాసనసభ తీర్మానం చేయనుంది.
ఏపీ శాసనమండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఏపీని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. సభలో వైసీపీ సభ్యుల పద్ధతి సరిగా లేదని లోకేష్ చెప్పారు.
వెటర్నరీ అంబులెన్సుల కోనుగోళ్లలో గత వైసీపీ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. 14వ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో ఇదే అంశంపై కూన రవికుమార్, ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడారు.