Home » Annamayya District
జాతీ య రహదారి అంటే రోడ్డుకు ఇరువైపులా కంటికి ఇంపుగా కనిపించాలి. ఇందుకు గాను నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుంది. కనీసం పట్టణం గుండా వెళ్లే రహ దారైనా చక్కగా ఉంచాల్సిన బాధ్యత మనది. ఈ రోడ్డు మనది కాదని ఆర్అండ్బీ, పట్టణ పాలక కమిటీ బాధ్యత మరిచింది. జాతీయ రహదారి అధి కారులు గాలికి వదిలేయడంతో జాతీయ రహదారికి ఇరువైపులా మట్టి పేరుకు పోయి ఉంది. అంతే కాకుండా రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేయడం పరిపాటైంది.
మండల రైతులు నానో(లిక్విడ్) యూరియా వాడితే అధిక దిగుబడులు సాధ్యమని మండల ప్రత్యేక అధికారి సతీష్కుమార్ సూచించారు.
పెరిగిన సాంకేతిక విప్లవంలో దండోరా కాలగర్భంలో కలిసిపోయింది. దండోరా వేయడం అంతరించిపోవడంతో వాటిపై ఆధారపడ్డ కుటుం బాలు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లాయి.
మొక్క లను పెంచండి, చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడాలని ఓ వైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెవిలో జోరీగలా ఊదరగొడుతున్నా, అవగాహన సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా వ్యాపారులు వృక్షాలను ఇష్టానుసారంగా నరికేస్తు న్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నా యి.
కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకట రమణ స్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాల్లో మూడో రోజు టీటీడీ ఆధ్వర్యంలో పవి త్రాల సమర్పణ వేడుకగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకం, ధూపదీప నైవేద్యాలు పూర్తిచేశారు.
ఎన్నో ఏళ్లగా సాగు, తాగునీరందించిన భోగంపల్లె రిజ ర్వాయర్ వర్షాభావంతో నీరు అడుగంటాయి. 2015లో ఏకదాటిగా కురిసిన వర్షాలతో రిజర్వాయ ర్ నీటితో కళకళలాడేది. కొన్నేళ్లు వ్యవసాయానికి, పట్టణ ప్రజలకు నీటి సమస్య లేకుండా కాపాడ డం గమనార్హం.
ఖరీ ఫ్ సీజన్, వర్షాలు కురుస్తుండడంతో, వరి, వేరుశనగ, ఇతర పంటలకు అదును కావడంతో రైతు లు వరి నాట్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో వరి సాగు చేసి నెల రోజులు, మరికొన్ని చోట్ల 20 రో జులు దాటుతున్నా ఇప్పటికీ రైతులు యూరియా వేయలేదు. నాట్లు వేసిన 15 రోజులకే యూరి యా చల్లాల్సి ఉండగా అవసరం మేరకు యూరి యా దొరకడంలేదు. దీంతో యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు.
చెరువు భూమిని ఆక్రమించి అందులో సాగు చేసిన టమోట సాగును రక్షించుకునేందుకు చెరువు తూమును తొలగించి నీటిని వదిలేసినట్లు రెవెన్యూ అధి కారులకు ఫిర్యాదు అందింది.
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనుల నిర్వహణపై శ్రద్ద వహించాలని డీపీఓ రాధమ్మ ఆదేశించారు.
మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్లల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి. మండలంలో సుమారు ఏడు వేల వ్యవసాయ కనెక్షన్లు, 16 వేల దాకా గృహ విని యోగ కనెక్షన్లు ఉన్నాయి. నాణ్యమైన విద్యుత్ను అందించలేక పోతున్నారు. అంతేకాకుండా సిబ్బం ది కొరతతో పలు అంతరాయాలు ఏర్పడుతున్నా యి.