Home » Ananthapuram
కర్ణాటక సరిహద్దులోనే మండలం ఉంది. కర్ణాటకలో మద్యంతాగి.. మండలానికి చెందిన యువకులు ఊగుతున్నారు. సరిహద్దు దాటి అవతలికి వెల్లి పూటుగా మద్యం తాగుతున్నారు. అదే మత్తులో ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ మండలంలోకి వస్తున్నారు.
దంపతుల మధ్య సమస్య పరిష్కరించడానికి కులపెద్దలు పంచాయితీ చేస్తారట. అందుకు ఏకంగా రూ.10లక్షలు, పది తులాల బంగారం ఇవ్వాలని తీర్మాణం చేశారు. ఈ ఘటన గుంతకల్లులో వెలుగుచూసింది. బాధితురాలు తన సమస్యను చెప్పుకోవడానికి సోమవారం కలెక్టరేట్కు వచ్చింది.
ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ప్రమీల (45) అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాలు భార్య ప్రమీల అదే గ్రామానికి చెందిన వడ్డే నెట్టికంటికి ఐదేళ్ల కిందట రూ.20వేలు వడ్డీకి అప్పు ఇచ్చింది.
‘రమా.. అప్పుడే నన్ను వదిలి పోతివా..? నాకు పని చేతకాదు. మన బిడ్డను ఎలా సాకాలి? ఎలా బతకాలి?’ అంటూ భార్య మృతదేహంపై పడి దివ్యాంగుడైన భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన సోమవారం తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది.
రేమండ్స్ పరిశ్రమ రాకతో రాప్తాడు భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. జాకీ పరిశ్రమ స్థానంలో రేమండ్స్ వస్త్ర పరిశ్రమ మంజూరు చేసిన నేపథ్యంలో సోమవారం రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు.
ఏదైనా సాధించాలన్న తపన ఆ యువతిని కిలిమంజారో పర్వత శిఖరాలపైకి తీసుకెళ్లింది. పర్వతంలో రాళ్లు, గుండ్ల కంటే.. జీ వితంలోనే ఎక్కువగా కష్టాలను అధిగమించింది. నిరుపేద కుటుంబంలో పుట్టింది. కూలికెళ్తేనే కుటుంబం గ డుస్తుంది.
టీటీడీ మాజీ ఏవీఎస్వో, ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ కేసులో పలు కోణాల్లో అనంతపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీల పక్షపాతి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న భక్త కనకదాసు జయంతి వేడుకలు, విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
ప్రతి నెలా కొందరు డీలర్లు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. గుంతకల్లు పట్టణంలో 70, మండలంలో 39 రేషన్ షాపులు ఉన్నాయి. దాదాపు 42 వేల కార్డులు ఉన్నాయి. పలు రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు సుమారు ఒకటిన్నర కిలోల బరువున్న డబ్బాను ఉంచి.. తూకం వేసి లబ్ధిదారులకు వేస్తున్నారు. 20 కేజీల బియ్యాన్ని ఒకసారి ఇలా తూకం వేసి ఇస్తారు.
డ్రగ్స్, గంజాయి సమస్యను అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ఎస్పీ జగదీ్షతో కలిసి మాదకద్రవ్యాలు, గంజాయి నియంత్రణ చర్యలు-అవగాహన కార్యక్రమాల సమీక్షకు సంబంధించి ఎన్బీఓఆర్డీ(నార్కో కోఆర్డినేషన సెంటర్) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా కోసం ..