Home » Ambati Rayudu
అమరావతి, జనవరి 10: జనసేన అధినేత పవన్ కల్యాణ్తో భేటీ అనంతరం కీటక ప్రకటన చేశారు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ట్విట్టర్ వేదికగా.. పవన్తో భేటీ వివరాలను వెల్లడించారు. తాను స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన ఆశయాలు నెరవేర్చడానికి తాను వైసీపీలో చేరానని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తో మాజీక్రికెటర్ అంబటి రాయుడు ( Ambati Rayudu ) బుధవారం నాడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Amabti Rayudu) జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సమావేశం అయ్యారు. జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారు. టికెట్పై వైసీపీ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.
ఇటీవలే వైసీపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. కొద్ది రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి పొలిటికల్ ప్రకంపనలు సృష్టించారు. అయితే, తాజాగా అంబటి రాయుడు మరో సంచలన ప్రకటన చేశారు.
వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. పార్టీని వీడుతున్నానని సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన చేశారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో గురువారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం సీఎం క్యాంప్ కార్యాలయంలో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
రాజధాని అమరావతికి మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు వచ్చారు. స్థానిక వైసీపీ నేతల విజ్జప్తి మేరకు అంబటి రాయుడు రాజధానికి వచ్చారు. వెలగపూడిలోని వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్లారు. అయితే.. విషయం తెలుసుకొని అమరావతి రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో సీన్ అంతా ఆసక్తికరంగా మారిపోయింది.
అవును.. క్రికెట్కు (Cricket) రిటైర్మెంట్ ప్రకటించిన అంబటిరాయుడు (Ambati Rayudu) పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలెట్టేశారు.. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు.. ఎన్నికల ముందు నుంచే పక్కా ప్లాన్తో క్రికెట్ పిచ్ నుంచి పాలిటిక్స్లోకి దిగిపోయారు..
అవును.. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఒక్కసారిగా బూతుల రాయుడుగా మారిపోయాడు..! నడిరోడ్డుపై నానా రచ్చ చేసి ఓ పెద్దాయనపై దాడి చేయబోయాడు..! అంతటితో ఆగలేదు నోటికొచ్చినట్లు పచ్చి బూతులు మాట్లాడేశాడు..! ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) వేదికగా తెగ వైరల్ అవుతోంది...
ఇటీవలే ఐపీఎల్కు గుడ్బై చెప్పిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని, ఆయనకు గాలం వేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఆయన గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు.