Home » Amaravati farmers
రాజధాని రైతులకు కౌలు చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ ఏపీ హైకోర్టులో మూడు వారాలకు వాయిదా పడింది.
ఏపీ రాజధాని అమరావతి (AP Capital Amaravati) ప్రాంతం పరిధిలో ఉన్న గ్రీన్ జోన్ను (Green Zone) రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో.. నివాస ప్రాంతాలకు 500 మీటర్లు దాటి కూడా అనుమతులు ఇచ్చేందుకు సీఆర్డీఏకు (CRDA) అధికారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపింగ్ సంస్థల అభ్యర్థనలు మేరకు ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు జగన్ సర్కార్ (Jagan Govt) చెబుతోంది. .
రాజధాని అమరావతికి మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు వచ్చారు. స్థానిక వైసీపీ నేతల విజ్జప్తి మేరకు అంబటి రాయుడు రాజధానికి వచ్చారు. వెలగపూడిలోని వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్లారు. అయితే.. విషయం తెలుసుకొని అమరావతి రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో సీన్ అంతా ఆసక్తికరంగా మారిపోయింది.
అమరావతి రైతులకు కౌలు మంజూరు చేస్తున్నట్లు సీఆర్డీఏ ప్రకటించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి రైతులకు కౌలు చెల్లించేందుకు రూ.240 కోట్లు విడుదల చేసింది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan reddy) తప్పుడు నిర్ణయం భస్మాసుర హస్తంగా మారిందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న శపథం చేశారు. అమరావతి ఉద్యమానికి 1300 రోజులు పూర్తయిన సందర్భంగా రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నాలుగేళ్ల నరకంలో నవ నగరం పేరిట మందడంలో చేపట్టిన కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్ష నేతలు పాల్గొన్నారు. అమరావతి రైతులకు తెలంగాణ రైతులు మద్దతు తెలిపారు.