Home » Amaravati farmers
ఇప్పుడే పుట్టిన అమరావతి పసికూనను జగన్ నాశనం చేయాలనుకుంటే అమరావతి రైతులు ఉద్యమం చేపట్టి జగన్ను పాతాళ లోకానికి తొక్కేస్తారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ రాయపూడిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది నిజం కాదా అని కొలికపూడి ప్రశ్నించారు.
వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరని మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజధాని అమరావతి మునిగిపోతుందంటున్న వారు ఇక్కడికి వచ్చి చూడాలని.. కారణాలు తెలియకుండా మాట్లాడవద్దని మంత్రి నారాయణ హితవు పలికారు.
రాజధాని కోసం వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చింది. అయితే ఆ ప్లాట్లపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు, నియమాలు, సాంకేతిక కారణాలు చూపుతూ ముఖం చాటేశారు.
చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇవాళ (శుక్రవారం ఆగస్టు1) నుంచే ఉచిత విద్యుత్ అమలుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అమరావతి రైల్వే లైన్కు భూములివ్వటానికి తాము సిద్ధమని రైతులు స్పష్టం చేశారు. అయితే ఎంత నష్ట పరిహారం ఇస్తారు, భూ సమీకరణలో భూములు తీసుకుంటే రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడిస్తారో స్పష్టంగా ప్రకటన చేయాలని సూచించారు. స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూములు తీసుకోవాలని అమరావతి రైతులు కోరారు.
జర్నలిస్టు కృష్ణంరాజు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. కృష్ణంరాజు మాట్లాడిన వీడియోలు తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో రాజధాని దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
వైసీపీ పాలనలో అమరావతి రైతులపై నమోదు చేసిన రెండు కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. జగన్ హయాంలో వార్షిక కౌలు చెల్లించకపోవడంతో అమరావతి రైతులు...
రాష్ట్రంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరకు కంపెనీలతో కొనుగోలు చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. జగన్ విష ప్రచారం చేస్తూ, పొగాకు రైతుల మధ్య పొగ పెట్టాలని చూస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ పార్టీనే క్రిమినల్ మైండ్ పార్టీ అని మంత్రి నారాయణ విమర్శించారు. యావత్ దేశం సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడిన మాటలను ఖండించాలని మంత్రి నారాయణ అన్నారు.