Home » Alluri Seetharamaraju
అల్లూరి జిల్లాలో వరుస ఎన్కౌంటర్లకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆదివారం నిరసన దినం పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. మన్యంలోకి రావద్దని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.
రెండు ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టంలో జాప్యం జరుగుతోంది. దీంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఆ తొమ్మిది మృతదేహాలు ఉన్నాయి.
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. ఏ తల్లి నిను కన్నదో.. ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ కుగ్రామ ప్రవాసీయులు. సరైన కనీస మౌలిక వసతులు కూడా కరువైన గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ప్రపంచంలో అత్యధిక చమురును ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా అదే విధంగా ప్రపంచంలోకెల్లా ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసే ఖతర్ దేశాల్లోని చమురు, గ్యాస్ ఉత్పాదక సంస్థల్లో సమర్థవంతమైన నిపుణులైన ఇంజినీర్లుగా వెలుగొందుతున్నారు ఈ కుగ్రామ బిడ్డలు.
ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని... చెప్పినట్లే సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం నిమ్మలపాలెంలో షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సాయి పల్లవి(6), తల్లి గాయత్రి (28) మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలు నిర్వహించిన రాబిన్హుడ్ అల్లూరి సీతారామరాజు అని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ కొనియాడారు.
Lokesh Tribute Freedom Fighters: స్వాతంత్రత్య పోరాటయోధులు అల్లూరి, పింగళి వెంకయ్య, స్ఫూర్తిప్రధాత స్వామి వివేకానందకు మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. వారి సేవలను స్మరించుకున్నారు మంత్రి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలను ప్రపంచ పటంలో చంద్రబాబు నిలిపారని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ, ప్రకృతి అందాలకు కొదవలేదని ఉద్గాటించారు. అరకులోయ అందాలు ప్రపంచానికే తలమానికమని రాందేవ్ బాబా పేర్కొన్నారు.
Encounter: మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది ఉండేవారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సభ్యుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాదే ఎన్కౌంటర్లలో నలుగురు మృతి చెందారు. మిగిలిన 16 మందిలో 11 మంది తెలుగువారే కావడం గమనార్హం.