Home » Afghanistan
కొద్ది రోజులుగా సరిహద్దు ఘర్షణలతో అట్టుడికిన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ 48 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాలిబన్ల వినతి మేరకు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు పాక్ సైన్యం ప్రకటించింది. పాక్ విన్నపం మేరకే తాము కాల్పుల విరమణకు ఓకే అన్నామని తాలిబన్లు ప్రకటించారు.
కాందహార్ ప్రావిన్స్లోని పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 12 మందికి పైగా ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య..
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు అఫ్గాన్ అధికారులు ధృవీకరించారు. పాక్ దాడికి దీటుగా తమ సైన్యం కూడా ప్రతిఘటిస్తోందని అఫ్గాన్ స్పష్టం చేసింది.
దాదాపు వారంపాటు భారత్లో పర్యటించేందుకు ఆఫ్ఘాన్ మంత్రి ముత్తకీ వచ్చారు. అయితే, అక్టోబర్ 10న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా జర్నలిస్టులకు పిలుపు అందకపోవడం విమర్శలకు దారి తీసింది.
అఫ్గానిస్థాన్ మంత్రి ముత్తకీ పాల్గొన్న ఢిల్లీ ప్రెస్మీట్లో మహిళా జర్నలిస్టులు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. అయితే, పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు జారీ చేయడంతో కొందరికి పాస్లు అందలేదని తాలిబాన్లు తాజాగా వివరణ ఇచ్చారు.
అప్ఘాన్ మంత్రి ప్రెస్ నిర్వహణలో తమ పాత్ర లేదని భారత విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ప్రెస్ మీట్లో మహిళా జర్నలిస్టులు లేకపోవడంపై విమర్శలు తలెత్తిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది.
అప్ఘానిస్థాన్ మంత్రి ముత్తకీ తాజాగా ఢిల్లీలో జరిపిన పత్రికా సమావేశంలో మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
తమ ధైర్యాన్ని పరీక్షించే ప్రయత్నం చేయొద్దంటూ అఫ్గానిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి అమిర్ ఖాన్ ముత్తకీ భారత్ గడ్డ పైనుంచి పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమతో పెట్టుకుంటే ఏమవుతుందో రష్యా, అమెరికాలను అడిగి తెలుసుకోవాలని అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఆమిర్ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. రాజధాని కాబుల్లో భారత రాయబార కార్యాలయం మళ్లీ..
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ బాంబులతో దద్దరిల్లింది. నగరంలోని అనేక చోట్ల రాత్రి పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. మృతుల సంఖ్య వెల్లడికాలేదు. ఈ పేలుళ్లలో పాకిస్తాన్ పాత్ర ఉందని భావిస్తున్నారు.