Home » ACB
ఏపీలోని 120 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా, కోనసీమ, ఏలూరు, ప్రకాశం, విశాఖ, నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్ వెళ్లడానికి షరతులతో కూడిన అనుమతిని విజయవాడ ఏసీబీ కోర్టు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులు ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్పై బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగనుంది.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ అంబేడ్కర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చంచల్గుడా జైలులో ఉన్నారు. అతడిని ప్రశ్నించేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. వెంటనే అంబేద్కర్ను అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలక నేత నారాయణ స్వామి మొబైల్ను FSLకి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో నిందితులను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు. ఈ క్రమంలో లిక్కర్ స్కాం కేసుపై విచారణ చేపట్టింది న్యాయస్థానం.
ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీమంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఇతర అధికారులు బీఎల్ఎన్ రెడ్డి, కిషన్రావు, ఎఫ్ఈవోలను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా అరెస్టయిన మిథున్ రెడ్డికి.. రేపు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.