Home » ACB
మత్స్యకార సొసైటీలో నూతన సభ్యత్వాలను నమోదు చేయడం కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు.
ఆంధ్రప్రదేశ్ ఫైర్ సేఫ్టీ మాజీ డీజీ సంజయ్ని ఏసీబీ కస్టడీకి తీసుకుంది. జిల్లా జైలు నుంచి ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ACB అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ సంజయ్ను విచారిస్తోంది.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై ఖిలా వరంగల్లోని తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-30 పైలా దిలీప్కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పైలా దిలీప్కు బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు షరతులు విధించింది.
సిద్దిపట జిల్లా మద్దూరు మండల ఉపాధి హామీ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న ఈసీ బండకింది పర్శ రాములు లంచం తీసుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో 12 మంది నిందితులకు సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు మంగళవారం నిర్ణయం తీసుకుంది.
గత వైసీపీ హయాంలో సంజయ్ సీఐడీ చీఫ్గా పనిచేసినప్పుడు అవినీతి ఆరోపణలు బయటపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆయా చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు, అలాగే ఫైర్ సేఫ్టీ పరికరాలు కొనుగోలు విషయంలో ఆయన అవకతవకలకు పాల్పిడినట్లు తేలింది.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే కేసులో కర్నూలు కార్మిక శాఖ జాయింట్ కమిషనరు (జేసీ) బాలు నాయక్ అరెస్ట్ అయ్యారు. రెండవ రోజు ఏసీబీ అధికారులు 11 చోట్ల సోదాలు జరిపారు.
లంచం డిమాండ్ చేసి నగదు తీసుకుంటుండగా ఓ రిజిస్ట్రార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లను వేర్వేరుగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏపీలోని లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ మరోసారి పొడిగించింది. ఈ నేపథ్యంలో నిందితులను జైలుకు తరలించే క్రమంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్చల్ చేశారు.