Home » AAP
గత ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలుచుకున్న బీజేపీ తాజా ఎన్నికల్లో అసాధారణ గెలుపును సొంతం చేసుకోవడం వెనక డబుల్ ఇంజెన్ అభివృద్ధి మంత్రం పనిచేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు హామీతో పాటు మిడిల్ క్లాస్ వర్గం బీజేపీకి జైకొట్టడంతో కాషాయం పార్టీకి విజయం నల్లేరు మీద నడకగా మారింది.
దేశ రాజధాని ఢిల్లీ పీఠం మాత్రం బీజేపీకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఢిల్లీ వాసులు మాత్రం కేజ్రీవాల్నే నమ్మారు. దాదాపు 26 ఏళ్లుగా బీజేపీకి ఢిల్లీ పీఠం దూరంగానే ఉండిపోయింది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో 47 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచి కమలం పార్టీ గెలుపు ఖాయం చేసుకుంది. దశాబ్దకాలం తర్వాత ఢిల్లీ పీఠం చేజార్చుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి, సుపరిపాలనకే ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టారని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఆప్ అధినేత అయిన అరవింద్ కేజ్రివాల్ కూడా తన నిజయోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సచివాలయ ఉద్యోగులకు లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ సెక్రటేరియట్ను సీజ్ చేశారు. సచివాలయం నుంచి ఏ ఒక్క ఫైల్, రికార్డు, హార్డ్ డ్రైవ్ బయటకు వెళ్లకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.
సొంత నియోజకవర్గమైన న్యూఢిల్లీలో నాలుగోసారి పోటీచేసిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ను విమర్శిస్తూ రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ చేసిన ద్రౌపదీ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే జరిగింది. ఫలితాల్లో బీజేపీ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. అయితే, కాస్తలో కాస్త ఆప్ పార్టీకి ఊరట కలిగిస్తూ కల్కాజీ నియోజవర్గం నుంచి పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి విజయకేతనం ఎగురవేశారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఫిక్స్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మూడోసారి కూడా అడ్రస్ లేకుండా పోగా.. ఆప్ పార్టీ నాలుగోసారి ఢిల్లీ గద్దెనెక్కాలనే ఆశ ఆవిరైంది. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆప్, కాంగ్రెస్ పార్టీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలసికట్టుగా ఉండనందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీతో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఇప్పటికే కమలం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏకంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ను ఓడించిన వ్యక్తి ఎవరా అని ఇప్పుడంతా ఆరా తీస్తున్నారు. కాబోయే ఢిల్లీ సీఎం పర్వేష్ వర్మ అనడంతో ఈయన పేరు ప్రస్తుతం దేశమంతటా హాట్ టాపిక్గా మారింది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తది దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఉన్న ఫలితాల సరళి చూస్తే బీజేపీ మెజార్టీ మార్క్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఓటర్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ విజయం సాధించనప్పటికీ.. ఒక విషయంలో మాత్రం ఆ పార్టీ విజయం సాధించింది.