Home » AAP
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఒకటేనా.. ఏకపక్ష ధోరణితో ముందుకెళ్లడమే రెండు పార్టీల పరాజయానికి కారణమా.. కేజ్రీవాల్లో జగన్ లక్షణాలు అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం ఎంత..?
ఢిల్లీలో ఆప్, బీజేపీ మధ్య గట్టిపోటీలో.. కేజ్రీవాల్ పార్టీ మెజార్టీ మార్క్ చేరుకుంటారని అంతా అంచనావేశారు. కానీ చివరికి బీజేపీ అధికారానికి అవసవరమైన మెజార్టీ సాధించింది. కేజ్రీవాల్ ఓటమికి కారణాలు ఏమిటి.. ఆ ఒక్కపని చేసుకుంటే ఢిల్లీ ఫలితం మరోలా ఉండేదా.. కేజ్రీవాల్ చేసిన తప్పేంటి..
దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారం సాధించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. గత 12 సంవత్సరాలుగా ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీకి 22 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ మరోసారి రిక్త హస్తాలతో మిగిలిపోయింది.
ఒకవేళ బీజేపీ ‘ఆపరేషన్ కమల్’ను ప్రారంభిస్తే.. తుడిచిపెట్టుకుపోతుందా? ఇప్పుడు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇది..!
ఇప్పుడు... మాత్రం ‘ఆప్’నే ఢిల్లీ ఓటర్లు గెలుపు బరి నుంచి ఊడ్చేశారు. ఢిల్లీలో ముచ్చటగా మూడోసారి కూడా అధికారం దక్కించుకుంటామని, ఎన్ని అవరోధాలు వచ్చినా గెలుపు గుర్రం తమదేనని లెక్కలు కట్టిన సామాన్యుడి పార్టీ.. ఆమ్ ఆద్మీ ఘోర పరాజయం చవిచూసింది.
ఆప్ ప్రభుత్వ అవినీతిపై సిట్ ఏర్పాటు చేయడం తమ ప్రాధాన్యతా క్రమాల్లో ఒకటని బీజేపీ ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత కూడా ప్రకటించడంతో ఆప్కు మునుముందు చిక్కులు తప్పేలా లేవు.
వరుసగా మరోసారి విజయ కేతనం ఎగరేసి ఢిల్లీలో హ్యాట్రిక్ నమోదు చేయాలనుకున్న ఆప్ పార్టీ ఆశలు గల్లంతయ్యాయి. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్వయంగా తన నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన కేజ్రివాల్పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ విజయం సాధించారు.
ఢిల్లీలో పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంతో పాటు కార్యకర్తలు కూడా చెమటోడ్చి పని చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని విభేదాలు కూడా రచ్చ కెక్కి ఓటమికి కారణమయ్యాయి.
అందరూ ఊహించినట్టుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఘెర ఓటమిని మూటగట్టుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై స్పందించారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ముఖ్యంగా మధ్య తరగతి ఓటర్లను ఆకర్షించడంలో ఆ పార్టీ విజయం సాధించింది. గత పదేళ్లుగా ఆప్తో ఉన్న పేద, మధ్య తరగతి ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ వేసిన మంత్రం ఏమిటి..