Home » AAP
సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్గా విజేందర్ గుప్తా ఎన్నిక కాగానే ఆయనను ముఖ్యమంత్రి రేఖా గుప్తా, విపక్ష నేత సాదరంగా ఆయనను స్పీకర్ సీటుకు తోడ్కొని వెళ్లారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులందరికి కంటే ఎక్కువ మెజారిటీతో విజేందర్ గుప్తా గెలిచారు.
ఖాళీ ఖజానాను తమకు అప్పగించారంటూ సీఎం రేఖా గుప్తా చెప్పడంపై అతిషి మాట్లాడుతూ, పదేళ్ల తర్వాత ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీకి తాము అప్పగించామన్నారు. సాకుల కోసం వెతుక్కోకుండా ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ నిలబెట్టుకోవాలని సూచించారు.
పంజాబీ చిత్రాల్లోనే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ సోనియా మాన్ నటించారు. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో ఆమె నటించారు. ''హెడ్ ఎన్ సీక్'' అనే మలయాళ చిత్రంలో సినీరంగప్రవేశం చేసిన ఆమె 2014లో 'కహీ హై మేరా ప్యార్' అనే చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టారు.
ఆప్ నేత గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ, లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అతిషిని ఏకగ్రీవంగా నిర్ణయించామని, పార్టీ క్లిష్ట కాలంలో ఢిల్లీ సీఎంగా ఆమె సేవలందించారని ప్రశంసించారు. ఆరోగ్యకరమైన ప్రతిపక్షంగా ఆప్ తన బాధ్యతలను నెరవేరుస్తుందని చెప్పారు.
మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్కు కేటాయించిన డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని పంజాబ్ ప్రభుత్వం అంగీకరించింది. 2023లో మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎన్ఆర్ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్మెంట్ బాధ్యతలు ఆయనకు అప్పగించింది.
ప్రతాప్గంజ్ ఏరియాలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆస్తులను మాజీ ఎమ్మెల్యే, కార్యకర్తలు ఎత్తుకెళ్లిపోయారని బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి ఆరోపించారు.
బీజేపీ నుంచి గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నమ్మకం లేదని, ఆ పార్టీకి ఒక విజన్ కానీ, ప్రభుత్వాన్ని నడపగలిగే వ్యూహం కానీ లేవని అతిషి విమర్శించారు.
రైల్వే స్టేషన్లో తొక్కిసలాట విషాదం జరిగినప్పుడు రైల్వే మంత్రి దానిని గుర్తించేందుకు ఇష్టపడలేదని, ఎల్జీ మాత్రం ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత మృతుల సంఖ్య చెప్పకుండా ఆ పోస్ట్ను ఎడిట్ చేశారని సంజయ్ సింగ్ ఆరోపించారు.
ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ సమక్షంలో ఆప్ కౌన్సిలర్లు అనిత బసోయ (ఆండ్రూస్ గంజ్), నిఖిల్ చాప్రాన (హరి నగర్), ధర్మవీర్ (ఆర్కే పురం) ఆ పార్టీలో చేరారు. అనంతరం సచ్దేవ మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం, అసెంబ్లీ, మున్సిపల్ స్థాయిల్లో ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడనుందని చెప్పారు.
హవాలా లావాదేవీల ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసు కింద జైన్ను 2022 మేలో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం బెయిలుపై ఉన్న ఆయనపై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.