ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్పూఫింగ్పై వైసీపీ ఎంపీ నిరంజన్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని ఫ్లైట్స్ రిపోర్ట్స్ వచ్చాయని.. కంటెంజెన్సీ ప్రొసీజర్స్ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాయని తెలిపారు.
సిద్ధరామయ్య, డీకే మధ్య అధికార పంపణీ విషయంలో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు నేతలకు కొన్ని సూచనలు చేసింది. ముందుగా ఇరువురు నేతలు కలిసి చర్చించుకోవాలని, ఐక్యతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది.
ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనమే కారణమన్న కేంద్రంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. రైతులను నిందించడమే కేంద్రానికి ఆనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పనులతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యానని సింగ్ రికార్డు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లు, సెలెబ్రిటీలు సైతం డిజిటల్ అరెస్ట్ స్కామ్ల బారిన పడుతున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
పెంపుడు జంతువులను పార్లమెంటుకు తీసుకురావడం ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులను దుర్వినియోగం చేయడమే అవుతుందని బీజేపీ ఎంపీ జగదాంబికాపాల్ అన్నారు.
శీతాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంటు ముందున్న కీలక ఆంశాల గురించి మోదీ ప్రస్తావించే బదులు నాటకీయ ప్రసంగం సాగించారని ఖర్గే తప్పుపట్టారు. 11 ఏళ్లుగా పార్లమెంటరీ మర్యాదలు, వ్యవస్థను ప్రభుత్వం అణిచివేస్తోందన్నదే అసలు నిజమని అన్నారు.
విపక్షాల ఆందోళనలతో లోక్సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు.
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు ఓ భర్త. అంతేకాక ఆమె శవంతో సెల్ఫీ దిగి..వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు.
బెంగళూరు ట్రాఫిక్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమాజ్వాదీ ఎంపీ రాజీవ్రాయ్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ట్రాఫిక్ జామ్ను సరిచేసేందుకు ఒక్క పోలీసు కూడా కనిపించట్లేదన్న ఆయన కర్ణాటక సీఎంను ట్యాగ్ చేస్తూ నెట్టింట పోస్టు పెట్టారు.