తొలుత 15 సీట్లలో మహాకూటమి అభ్యర్థులు ఒకరితో మరొకరు తలపడుతూ నామినేషన్ల వేశారు. దీంతో గందరగోళం నెలకొంది. గురవారంనాడు జరిగిన మహాకూటమి నేతల మీడియా సమావేశంలో షీట్ల షేరింగ్ వివరాలను వెల్లడిస్తారనే ఊహాగానాలు వెలువడినప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశం ముగిసింది.
చొరబాటుదారులను సివాన్లో ఉండనీయాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే తాను చాలా స్పష్టంగా ఒకమాట చెబుతున్నానని అమిత్ షా అన్నారు. ఎన్డీయేకు ఓటు వేసి గెలిపిస్తే దేశంలోని ప్రతి ఒక్క చొరబాటుదారుని వెనక్కి పంపించి తీరుతామని హామీ ఇచ్చారు.
ఆర్జేడీ జంగిల్ రాజ్కు ఎన్డీయే స్వస్తి చెప్పి రాష్ట్రంలో సుపరిపాలన తెచ్చిందని మోదీ అన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రం విడిచిపెట్టి పోయారని, ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్న వాళ్లు యువతకు ఉద్యోగాలు ఇచ్చిందే లేదని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. మరికొద్ది రోజుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ..
బిహార్లోని సహర్సాలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో తేజస్వి మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన తరగతుల వాణిని వినిపించేందుకు ముఖేష్ సాహ్నీ డిప్యూటీ సీఎంగా ఉంటారని, ఆయనతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరింత మంది ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారని చెప్పారు.
విపక్ష మహాఘట్బంధన్పై ప్రధాని విమర్శలు గుప్పిస్తూ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ఏళ్ల తరబడి బిహార్ను లూటీ చేసిందని, ఇప్పుడు వీరంతా బెయిలుపై ఉన్నారని చెప్పారు.
త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై మల్లగుల్లాలు పడిన విపక్ష ఇండియా కూటమి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను ప్రకటించింది. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను విపక్ష ఇండి కూటమి ప్రకటించింది.
211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్లను ఎన్నికల అధికారి స్క్రూటినీ చేశారు. స్క్రూటినీ అనంతరం 81 మంది అభ్యర్థుల 135 నామినేషన్లను మాత్రమే ఎన్నికల అధికారి ఖరారు చేశారు.
లాలూతో సమావేశానంతరం గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ, బిహార్లో 243 సీట్లు ఉన్నాయని, 5 నుంచి 10 సీట్లలో స్నేహపూర్వక పోటీ పెద్ద విషయం కాదని అన్నారు. 'ఇండియా' కూటమి పూర్తి ఐక్యమత్యం, పూర్తి శక్తిసామర్థ్యాలతో పోటీకి సిద్ధంగా ఉందన్నారు.
జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్)లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పిస్తామని, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ గా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తేజస్వి యాదవ్ వాగ్దానం చేశారు.