ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్తో పాటు ఇద్దరు ఈసీలు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రియాంక ఓ సభలో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా 'చోర్ చోర్' అంటూ ప్రియాంక మద్దతుదారులు నినాదాలు చేయడం కనిపించింది.
మాగంటి గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్రెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తిపాస్తుల కోసమే వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లిద్దరూ పంచుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ కుమార్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు మరో నాలుగు రోజులు గడువు ఉండడంతో నగరంలో ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓ వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఓట్లను రాబట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు..
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ చేసి గెలుపొందారని మంత్రి పొన్నం అన్నారు. సెంటిమెంట్ మేనేజ్మెంట్ చేయడంలో బీఆర్ఎస్ నేతలకు అనుభవముందంటూ వ్యాఖ్యలు చేశారు.
జూబీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది.
3,75,13,302 మంది ఓటర్లలో 1,98,35,325 మంది పురుషులు కాగా.. 1,76,77,219 మంది మహిళలు, 758 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్ల కోసం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మూర్ఖుడు అయితే.. ఆయన కొడుకు కేటీఆర్ ఇంకా పెద్ద మూర్ఖుడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్కు లేదన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తులం బంగారం ఇవ్వడం కాదు.. ఉన్న బంగారాన్ని గుంజుకెళ్తారని విమర్శించారు.
అశ్వారావు పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన చాలా వినూత్నంగా ప్రచారం చేశారు. చికెట్ కొట్టి, పాడ పాడారు.
బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఇప్పుడిప్పుడే ఓటర్ల రాక మొదలైంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో అసలు బీజేపీనే లేదని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ముస్లింలను బీఆర్ఎస్ మోసం చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్రెడ్డి.