మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటని ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విమర్శించారు. మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత జగన్ మెప్పు, బిస్కెట్ల కోసం ఆ పార్టీ నేతలు అనిల్ కుమార్ ప్రసన్నకుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ నటుడు కిరాక్ ఆర్పీ ధ్వజమెత్తారు. ఆడవాళ్ల జోలికొచ్చినా, కించపరిచినా బాగుపడే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ప్రసన్న, అనిల్ కుమార్ పతనం ప్రారంభమైందని కిరాక్ ఆర్పీ విమర్శించారు.
కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నెల్లూరు జిల్లా వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఖండించారు. మహిళల జోలికి వస్తే వైసీపీ నేతలను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
Lokesh Criticism Jagan: వైఎస్సార్ హయాంలోనే 164 మంది కార్యకర్తలను చంపారని.. అప్పుడే భయపడలేదని.. రప్పా, రప్పాకు భయపడతామా అని మంత్రి లోకేష్ అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టారని గుర్తుచేశారు.
Lokesh VR High School Speech: సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్ మరొకటి ఉండదేమో అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణ, ఆయన కుమార్తె శరణి చేసిన కృషి చాలా గొప్పదని మంత్రి కొనియాడారు.
Minister Lokesh school Visit: వీఆర్ హై స్కూల్ను ప్రారంభించిన అనంతరం క్లాస్ రూంలను సందర్శించి డిజిటల్ విద్యావిధానాన్ని పరిశీలించారు మంత్రి లోకేష్. ప్రతీ క్లాస్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో యువనేతతో ఫోటోలు దిగేందుకు చిన్నారులు ఆసక్తి చూపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సూపర్ 6 పథకాలను వరుసగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరులో చీమకు అపకారం జరిగినా ఊరుకోమని స్పష్టం చేశారు.