Home » Andhra Pradesh » Kadapa
రాయచోటి జిల్లా కేంద్రం ఏర్పడిన కొంతకాలం రియల్ ఎస్టేట్ బాగానే నడిచింది. దాదాపు రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయి రిజిస్ట్రేషన్లు నత్తనడకన సాగుతున్న పరిస్థితి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉంది.
నకిలీ నోట్లు మార్చేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని బ్యాంకులోనే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు లక్కిరెడ్డిపల్లె మండలం కుర్నూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ నగదు విత్డ్రా చేసుకోవడానికి మండల కేంద్రంలోని స్టేట్బ్యాంకుకు వెళ్లాడు.
దేశబాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన తెలుగు భాష అతి ప్రాచీనమైనది. దీనికి సంబంధించిన తొలి తెలుగు శాసనం ఎర్రగుంట్ల మండలంలోని కలమల్ల గ్రామం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో ఉండటం గర్వకారణం.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది పార్టీని వీడగా.. తాజాగా జగన్ సొంత ఇలాకాలో కీలక నేతలు వైసీపీకి గుడ్బై చెప్పారు.
కూటమి ప్రభుత్వంలోని పలువురు కీలక నేతలతోపాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త బత్తల శ్రీనివాసుల రెడ్డిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు.
బద్వేలుకు చెందిన వైసీపీ నేత బత్తల శ్రీనివాసులరెడ్డిని కడప చిన్నచౌకు పోలీసులు హైదారబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం అయిన నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్తో పాటు పలువురు టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై బత్తల శ్రీనివాసులరెడ్డి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు.
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో వైద్యం కోసం వచ్చే రోగులకు ఓపీ కష్టాలు తప్పడం లేదు. రోగం నయం చేసుకోవడానికి వైద్యం కోసం వచ్చే వారికి ఓపీ తీసుకోవడం ఎంతో కష్టంగా మారింది.
బి.కోడూరు మండలంలో గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా రిజిస్టరు పొలాలను కూడా అగ్రిమెంట్లతో యథేచ్ఛగా ఆన్లైన్ చేశారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకు వేసి పిత్రార్జిత భూములు కూడా దొంగ అగ్రిమెంట్లు తయారుచేసి తహశీల్దారు కార్యాలయంలో ఆన్లైన్ చేయించుకున్నారు.
ఆకాంక్షిత జిల్లాల్లో దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది కడప జిల్లా. వినూత్న పథకాలు, ఇతర అభివృద్ధి పథకాలు వ్యూహాత్మక ప్రణాళిక చేసి జాతీయస్థాయిలో మొదటి స్థానం సాధించారు కలెక్టర్ చెరుకూర శ్రీధర్.
వెలిగల్లు ప్రాజెక్టు పూర్తయి సుమారు 16 సంవత్సరాలు అవుతోం ది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా నిర్దేశిత ఆ యకట్టుకు నీళ్లు అందడం లేదు. పిచ్చిమొక్క లు, మట్టి, రాళ్లతో కాలువలు పూడిపోవడం.. లైనింగ్ లేకపోవడంతో.. కాలువలకు వదిలిన నీళ్లలో ఎక్కువగా ఇంకిపోవడం.. బయటకు వెళ్లిపోతున్నాయి.