పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన
ABN, Publish Date - May 15 , 2026 | 11:12 AM
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవల్పమెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ఈ భారీ ప్రాజెక్టు చేపట్టనుంది.
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవల్పమెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ఈ భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయం రన్వేకి అనుసంధానంగా తొలిదశలో 138 ఎకరాల్లో రూ.15,803 కోట్ల పెట్టుబడితో ఫైటర్జెట్ల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది.
Updated at - May 15 , 2026 | 11:20 AM