ఎస్ఐఆర్పై వైసీపీ హడావుడి చేస్తోంది: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - May 31 , 2026 | 06:52 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం చంద్రబాబు వారితో చెప్పారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం చంద్రబాబు వారితో చెప్పారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై సీఎం అన్నారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంపై జూన్ 2న వర్క్షాప్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఐఆర్పై వైసీపీ హడావుడి చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
కరెంట్ పోయింది.. ఊపిరి ఆగింది
టీటీడీకి విద్యుత్ బస్సు విరాళం
Updated at - May 31 , 2026 | 06:52 AM