గుడ్ న్యూస్.. గ్రామపంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:46 PM
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ అధికారుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు తెలంగాణ సర్కార్ పచ్చ జెండా ఊపింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ అధికారుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు తెలంగాణ సర్కార్ పచ్చ జెండా ఊపింది. జూనియర్ అసిస్టెంట్లు, జీపీవోలకు 60:40 నిష్పత్తిలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది.
జిల్లా స్థాయిలో రొటేషన్ పద్ధతిలో ఈ ప్రక్రియ సాగనుంది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 12 నుంచి అమలులోకి రానున్నాయి. దీనివల్ల వేలమంది అధికారులకు లబ్ధి చేకూరడమే కాకుండా, గ్రామాల్లో పాలన మరింత పటిష్టం కానుంది. అధికారులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఎక్స్ప్రెస్లో మహిళపై అత్యాచారం.. బాధితురాలితో మాట్లాడిన రాయపాటి శైలజ
అక్కడే తేల్చుకోండి.. ఆకివీడు రామాలయం పిల్పై ఏపీ హైకోర్టు
Read Latest AP News And Telugu News