Share News

నెల్లూరులో లారీని ఢీకొన్న బస్సు.. డ్రైవర్ మృతి

ABN , Publish Date - Sep 05 , 2026 | 10:21 AM

తిరుపతి నుంచి విజయవాడకు సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారింది. కృష్ణపట్నం సమీపంలో వెంకటరమణ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందగా.. 18 మంది గాయపడ్డారు.

నెల్లూరులో లారీని ఢీకొన్న బస్సు..  డ్రైవర్ మృతి
Nellore Bus Accident

నెల్లూరు, సెప్టెంబర్ 5: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మనుబోలు మండలం కృష్ణపట్నం సమీపంలో తిరుపతి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వెంకటరమణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. మార్గమధ్యలో బస్సు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతిన్నది. డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన చూసి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు.


ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది గాయపడినట్లు సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మట్టి గణపతులకు ధర నిర్ణయం

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 11:53 AM