చికెన్ ప్రియులకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి..
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:05 AM
తెలంగాణ రాష్ట్రంలో మాంసం ప్రియులకు కష్టకాలం వచ్చిపడింది. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మాంసం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది.
హైదరాబాద్, మార్చి29: తెలంగాణ రాష్ట్రంలో మాంసం ప్రియులకు కష్టకాలం వచ్చిపడింది. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మాంసం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా ఫౌల్ట్రీ కంపెనీలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. తమకు ఇచ్చే కమీషన్, మార్చిన్ ను భారీగా తగ్గించడాన్ని నిరసిస్తూ ఏప్రిల్1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నగర వ్యాప్తంగా దీనికి సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. తగ్గించిన మార్జిన్ను తిరిగి సవరించి, తమకు న్యాయం చేసే వరకు షాపులు తెరిచేది లేదని స్పష్టం చేశారు.
చికెన్ షాపులు మూసివేయడంతో ప్రత్యామ్నాయం చూసుకునే పనిలో పడ్డారు. ముందుగానే చికెన్ కొని ఫ్రిజ్లో స్టాక్ చేసుకుంటున్నారు. చికెన్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా పచ్చళ్లు పెట్టుకుంటున్నారు. చికెన్ షాపులు ఎక్కువ రోజులు మూసివేస్తే గ్రామీణ ప్రాంతాల్లో నాటు కోళ్ళతో పాటు కోడిగుడ్లు, మాంసం, చేపలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల కాలంలో మాంసం ధర వెయ్యి రూపాల వరకు పెరిగిపోవడంతో, చాలా మంది చికెన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో చుట్టాలు వచ్చినా, చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటే చికెన్కే ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే చికెన్ షాపులు మూసివేయడం చికెన్ ప్రియుకు ఇబ్బంది పెట్టే విషయం అంటున్నారు. ఈ మూడు రోజుల్లో చికెన్ ఏ రేంజ్లో అమ్ముడు పోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..