అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి
ABN , Publish Date - May 25 , 2026 | 06:01 PM
అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బెంగళూరు హైవేపై హత్యకు ఉపయోగించిన 'స్కార్కియో' వాహనం స్వాధీనం చేసుకుని, కారును విక్రయించిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ వద్ద కారు ఢీకొన్న ఘటనలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మరణించిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. బెంగళూరు హైవేపై హత్యకు ఉపయోగించిన 'స్కార్కియో' వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. భూ తగాదాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం, ఇంటి నుంచి బయటకు వచ్చిన ఖాజా మొయినుద్దీన్ను నిందితులు వాహనంతో ఢీకొట్టి హత్య చేసినట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్కార్పియో వాహనాన్ని ఇటీవల స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ కారును గతంలో విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తాను ఆ వాహనాన్ని ఆరు నెలల క్రితమే అమ్మేశానని వాహన యజమాని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వాహనం ఎవరి వద్ద ఉందన్న దానిపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కల్వకుర్తికి చెందిన వినయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరికొంతమంది అనుమానితుల కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read:
ప్రయాణంలో ఈ ఫుడ్స్ తింటే డేంజర్
మానసికంగా బలంగా మారాలంటే ఏమి చేయాలి?
For More Latest News