Share News

‘చిన్నస్వామి’లో మ్యాచ్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Mar 17 , 2026 | 02:51 AM

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొన్న...

‘చిన్నస్వామి’లో మ్యాచ్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌

షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ ఆరంభం

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొన్న అనంతరం ఐపీఎల్‌ మ్యాచ్‌లను జరిపేందుకు కర్ణాటక ప్రభుత్వం సోమవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న చిన్నస్వామిలో జరిగే ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. హోం గ్రౌండ్‌గా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ 5 మ్యాచ్‌లు.. రెండో హోంగ్రౌండ్‌గా ఎంచుకొన్న రాయ్‌పూర్‌లో 2 మ్యాచ్‌లు ఆడనుంది. గతేడాది జూన్‌ 4న ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడంతో ఈ స్టేడియంలో క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌పై ఆందోళన నెలకొంది.

ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 02:51 AM